Venu Goapl Reddy
Author- NTV Telugu-
Delhi: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి “లివ్-ఇన్ పార్ట్నర్” అఘాయిత్యం..
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక తల్లి ‘లివ్ ఇన్ పార్ట్నర్’ అని పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ నివాసి అంకిత్ యాదవ్(29) అనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్) -
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం.. రామ మందిర గర్భగుడిలోకి “రామ్ లల్లా” విగ్రహం..
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. రామ మందిర ఆలయ గుర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
Iran’s strikes in Pakistan: “ఆత్మరక్షణ కోసమే”.. పాకిస్తాన్పై ఇరాన్ దాడి.. భారత్ స్పందన..
Iran's strikes in Pakistan: పాకిస్తాన్పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది. -
Karnataka: “రెండు బొమ్మల్ని టెంట్లో ఉంచి రాముడు అన్నారు”.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Karnataka: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్నా కొద్ది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రాజన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండు బొమ్మల్ని టెంటులో ఉంచి వాటినే రాముడని అన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
Corbevax: భారత తయారీ కార్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్కి WHO అత్యవసర వినియోగ అనుమతి..
Corbevax: భారత తయారీ కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది. కార్బెవాక్స్ టీకాను హైదరాబాద్కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ E లిమిటెడ్ తయారు చేసింది. దీనిపై బయోలాజికల్ E డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ..WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) పట్ల మేము సంతోషంగా ఉన్నామని, ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా మా ప్రపంచ పోరాటాన్ని బలపరుస్తుందని అన్నారు. -
Military Strength Ranking: మిలిటరీ పవర్లో టాప్లో అమెరికా, లాస్ట్ భూటాన్.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?
Military Strength Ranking: ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. రష్యా, చైనాలు వరసగా రెండూ, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్సైట్ గ్లోబల్ ఫైర్పవర్ 2024కి గానూ -
Sharad Pawar: కీలక రామ మందిర వేడుకని రాజీవ్ గాంధీ జరిపారు.. బీజేపీది రాజకీయం
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
Direct-to-Mobile: సిమ్, ఇంటర్నెట్ లేకున్నా సెల్ఫోన్లలో వీడియోలు.. కేంద్రం బిగ్ ప్లాన్..
Direct-to-Mobile: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా వీడియోలు చూసే రోజులు త్వరలో రాబోతున్నాయి. సమీప భవిష్యత్తులో డైరెక్ట్-టూ-మొబైల్ ప్రసారాలు నిజం అయ్యే అవకాశం ఉంది. బ్రాడ్కాస్టింగ్ సమ్మిట్ని ఉద్దేశిస్తూ సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. డైరెక్ట్-టూ-మొబైల్(D2M) సాంకేతికత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. -
Flight Delay: ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్స్.. ఫ్లైట్స్ ఆలస్యంపై కేంద్రం ప్రణాళిక..
Flight Delay: పొగమంచు, వాతావరణ పరిస్థితులు దేశంలో విమానయానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో పొగమంచు పరిస్థితులు వందల సంఖ్యలో విమానాల రాకకు అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అవస్థలు పడ్డారు. ఏకంగా కొందరు ప్రయాణికలు విమాన సిబ్బందిపై దాడులు చేయడమే చేయడం, ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేయడం వైరల్గా మారాయి. -
World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభిస్తుంది.. సంచలనంగా జర్మన్ రహస్య పత్రాలు..
World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభించే అవకాశం ఉందని జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన రహస్య పత్రాలు పేర్కొన్నాయి. ఈ సమాచారాన్ని బిల్డ్ వార్తా పత్రికలో ప్రచురితమైంది. జర్మనీ రష్యాకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది నాటో మిత్రదేశాలపై దాడి చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించగలదని, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తాపత్రిక పేర్కొంది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!