Tata To Make iPhones: ఐఫోన్ల తయారీలోకి టాటా గ్రూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata To Make iPhones: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా కొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 115 ఏళ్ల టాటా సంస్థ ఉప్పు నుంచి టెక్నాలజీ దాకా ఎన్నో రంగాల్లో ఉంది. ఇకపై టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. టాటా గ్రూప్ రెండున్నరేళ్లలోనే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఇది భారతదేశ ఉత్పత్తి నైపుణ్యం సత్తాను చాటనుంది.
భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియన్ ఎలక్ట్రానికస్ కంపెనీల వృద్ధికి పూర్తిగా మద్దతు ఇస్తుందని, ఇది భారతదేశాన్ని తమ విశ్వసనీయ తయారీ భాగస్వామిగా మార్చుకునేందుకు, భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ శక్తిగా మార్చాలనే ప్రధాని మంత్రి లక్ష్యాన్ని సాధించాలనుకునే గ్లోబల్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు మద్దతు ఇస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
టాటా గ్రూప్ ఆపిల్ సరఫరాదారు విస్ట్రాన్ కార్ఫ్ కార్యకలాపాలను కొనుగోలు చేసింది. ఈ రోజు జరిగిన బోర్డు మీటింగ్ లో ఈ ప్రకటన వెలువడింది. భారతీయ కంపెనీ భారతదేశం నుంచి ప్రపంచ సరఫరా గొలుసును నిర్మిస్తునందుకు విస్ట్రాల్ కు కేంద్రమంత్రి థాంక్స్ చెప్పారు. మేక్ ఇన్ ఇండియాని పెంపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అనేక ప్రోత్సకాలను ఇస్తున్నారు. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఆపిల్ నెమ్మదిగా చైనా నుంచి బయటకు వస్తోంది.
పీఎల్ఐ( ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్) పథకం ద్వారా దేశీయంగా తయారీని పెంచడం తద్వారా ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులకు మద్దతు ఇవ్వడం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, వస్త్రాలు, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, అధిక సామర్థ్యం గల సోలార్ PV మాడ్యూల్స్, అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు మరియు ఫార్మాస్యూటికల్స్ వంటి 14 సెక్టార్లలో ఈ పథకాన్ని 2021లో ప్రకటించారు.
PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports.
Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) October 27, 2023
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!