Maldives: భారత సైనికులు మాల్దీవులు వదిలివెళ్లాలి.. కాబోయే ప్రెసిడెంట్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ దేశంపై పట్టుపెంచుకునేందుకు చైనా కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చైనా మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మహ్మద్ మయిజ్జు అక్కడి ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఈ పరిణామం భారత్కి మింగుడుపడని అంశంగా మారింది.
మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని, దేశంలో ఉనన భారతీయ సైనికులు విడిచి వెళ్లాలని మయిజ్జు చెప్పాడు. ఎన్నికల ప్రచార సమయంలో మయిజ్జు తాను గెలిస్తే మాల్దీవుల్లో భారత దళాలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇజ్రహీం సోలిహ్ దేశ సార్వభౌమాధికారాన్ని ఇండియాకు తాకట్టు పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బ్లూమ్ బర్గ్ టవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. భారతీయ సైనికులే కాదు, మరే ఇతర దేశాలకు చెందిన సైనికులైన తమ స్పందన ఇలాగే ఉంటుందని అన్నారు.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
Read Also: China: మటన్ పేరు చెప్పి పిల్లి మాంసం అమ్ముతున్న చైనా
మాల్దీవుల్లో ప్రస్తుతం 70 మంది భారతీయ సైనిక సిబ్బంది ఇండియా ఇచ్చిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో గస్తీకి సాయపడుతున్నాయి. సైనిక ఉనికిని తొలగించేందుకు ఇప్పటికే తాను చర్చల్ని ప్రారంభించానని మయిజ్జు తెలిపారు. భారతీయ సైనికుల స్థానంలో ఇతర దేశాల సైనికులు ఇక్కడికి రారని, చైనా లేదా మరేదైనా దేశానికి చెందిన సైనికులను అనుమతించబోమన్నారు.
ఆసియాలో కీలక శక్తులుగా ఉన్న భారత్, చైనాలు మాల్దీవులపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. పాత అధ్యక్షుడు ఇజ్రాహీం సోలెహ్ ఇండియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండు దేశాలు కూడా మాల్దీవుల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చైనా, ఇండియా కేంద్రంగా ప్రచారం జరిగింది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న ద్వీప దేశం ఇటు భారత్, అటు చైనాకు కీలకంగా మారింది. కొత్తగా ఎన్నికైన మయిజ్జు నవంబర్ 15న పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.
- Tags
- china
- india
- Maldives
- Mohamed Muizzu
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!