Maldives: భారత సైనికులు మాల్దీవులు వదిలివెళ్లాలి.. కాబోయే ప్రెసిడెంట్ వ్యాఖ్యలు..
Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ దేశంపై పట్టుపెంచుకునేందుకు చైనా కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చైనా మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మహ్మద్ మయిజ్జు అక్కడి ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఈ పరిణామం భారత్కి మింగుడుపడని అంశంగా మారింది.
మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని, దేశంలో ఉనన భారతీయ సైనికులు విడిచి వెళ్లాలని మయిజ్జు చెప్పాడు. ఎన్నికల ప్రచార సమయంలో మయిజ్జు తాను గెలిస్తే మాల్దీవుల్లో భారత దళాలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇజ్రహీం సోలిహ్ దేశ సార్వభౌమాధికారాన్ని ఇండియాకు తాకట్టు పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బ్లూమ్ బర్గ్ టవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. భారతీయ సైనికులే కాదు, మరే ఇతర దేశాలకు చెందిన సైనికులైన తమ స్పందన ఇలాగే ఉంటుందని అన్నారు.
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
Read Also: China: మటన్ పేరు చెప్పి పిల్లి మాంసం అమ్ముతున్న చైనా
మాల్దీవుల్లో ప్రస్తుతం 70 మంది భారతీయ సైనిక సిబ్బంది ఇండియా ఇచ్చిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో గస్తీకి సాయపడుతున్నాయి. సైనిక ఉనికిని తొలగించేందుకు ఇప్పటికే తాను చర్చల్ని ప్రారంభించానని మయిజ్జు తెలిపారు. భారతీయ సైనికుల స్థానంలో ఇతర దేశాల సైనికులు ఇక్కడికి రారని, చైనా లేదా మరేదైనా దేశానికి చెందిన సైనికులను అనుమతించబోమన్నారు.
ఆసియాలో కీలక శక్తులుగా ఉన్న భారత్, చైనాలు మాల్దీవులపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. పాత అధ్యక్షుడు ఇజ్రాహీం సోలెహ్ ఇండియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండు దేశాలు కూడా మాల్దీవుల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చైనా, ఇండియా కేంద్రంగా ప్రచారం జరిగింది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న ద్వీప దేశం ఇటు భారత్, అటు చైనాకు కీలకంగా మారింది. కొత్తగా ఎన్నికైన మయిజ్జు నవంబర్ 15న పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.
- Tags
- china
- india
- Maldives
- Mohamed Muizzu
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!