USA: అమెరికాలో ఓ మహిల దారుణ హత్యలకు పాల్పడింది. శృంగారం కోసం వచ్చే పురుషుల్ని చంపేసింది. రెబెక్కా ఆబోర్న్ అనే 33 ఏళ్ల మహిళ, పురుషులతో సెక్స్ తర్వాత వారికి ప్రాణాంతక మత్తుపదార్థాలు ఇచ్చి చంపేసేది, ఆ తరువాత వారిని దోచుకునేది. ఇలా నలుగురిని హత్యలు చేసిన రెబెక్కాపై పోలీసులు బుధవారం అభియోగాలు మోపారు.
Rahul Gandhi: ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలపై హమీల వర్షం కురిపించారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గడ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉంది. వచ్చే నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమయ్యాయి.
Qatar: ఖతార్ దేశంలో 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసి, ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ఉరిశిక్ష విధించడంపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఖతార్ లోని సాయుధ బలగాలకు శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించే దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. అయితే ఈ కేసులో ఈ సంస్థ యజమానిని అరెస్ట్ చేసిందా,
లాగిన్ వివరాలు ఇచ్చిన విషయాన్ని ఆమె సమర్థించుకున్నారు. తాను మారుమూల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకనే ఈ వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనకు ఓటీపీ వస్తుందని, నా ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని చెప్పారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లు నిర్వహించే ఎన్ఐసీ దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని చెప్పారు.
ప్రజల సొంతింటి కల ఎంతలా ఉంటుందనే దానికి పూణేలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పూణేలోని నివాసితులు రూ. 1.5-2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఏకంగా 8 గంటలు క్యూలో నిల్చుకున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాద్ ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gujarat: ఎంతటి కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలోని 7గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Uttar Pradesh: దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన అత్యాచార చట్టాలు ఉన్నా కామాంధులు, మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 35 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వాడీ అల్ నట్రూన్ సమీపంలో కైరో-అలెగ్జాండ్రియా డెజర్ట్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో చెలరేగిన మంటల కారణంగా మరణించినవారిలో 18 మంది కాలిబూడిదయ్యారు. 53 మంది గాయపడ్డారు.
Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.