Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఆదివారం ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు ఉంది.
Pakistan: పాకిస్తాన్ చెర నుంచి 80 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. చేపల వేటకు వెళ్లిన వీరు భారత సముద్ర జాలాలు దాడి పాకిస్తాన్ జలాల్లోకి తెలియకుండా వెళ్లడంతో అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా విడుదలై ఈ రోజు తమ కుటుంబాలతో దీపావళి చేసుకునేందుకు సొంతూళ్లకు వెళ్లారు.
HD Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాగ్ధానాలు చేస్తున్నారని సిద్దరామయ్యపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల ప్రచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Hamas: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఆస్పత్రుల మాటున ఉన్న హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు ముమ్మరదాడుల్ని నిర్వహిస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్గా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇక్కడి నుంచే హమాస్ టన్నెల్ వ్యవస్థ మొదలవుతోందని, ఆస్పత్రులను హమాస్ రక్షణగా ఉపయోగించుకుంటోదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అల్ షిఫా ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ఐడీఎఫ్ సిద్ధమైంది.
Titanic: టైటానిక్.. ఈ అద్భుత నౌక ప్రమాదం బారిన పడి మునిగిపోయి వందేళ్లు గడుస్తున్నా.. ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. 1912, ఏప్రిల్ 14న రాత్రి సమయంలో ఈ నౌక మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. 1500 మంది సముద్రంలో మునిగిపోయి మరణించారు.
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. తమ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం వివాదాస్పదం అయింది. అంతే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం బహిష్కరించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్, కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది.
Wife kills husband: తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలై నెల రోజులు గడిచాయి. హమాస్ ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేంది లేదని స్పష్టం చేసింది. అయితే గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఆర్మీ చుట్టుముట్టింది. ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందుకే వాటిని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రి చుట్టు ఇజ్రాయిల్ తన ట్యాంకుల్ని మోహరించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.