Himanta Biswa Sarma: ‘‘ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’.. అస్సాం సీఎం ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు ఉంది.
‘సో బ్యూటిఫుల్, సోలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అంటూ ఓ బట్టల దుకాణంలో మహిళ చేసిన సందడి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో జాస్మీన్ కౌర్ అనే మహిళ ఉత్సాహంగా సల్వార్ సూట్లను విక్రయిస్తున్న వీడియో ఈ డైలాగ్ చెప్పింది. ఇదే డైలాగ్ని ఉపయోగించి అస్సాం సీఎం ఓ వంతెన అందాన్ని వివరిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.
Also Read
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
Read Also: Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..
అస్సాంలోని తేజ్ఫూర్లోని కోలియా భోమెరా వంతెన అద్భుతమైన ఫోటోలు, వంతెనతో పాటు హిమాలయాల అందాలను తన పోస్టులో పంచుకుంటూ..‘‘సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’ అంటూ ట్వీట్ చేశారు. తేజ్పూర్ లోని కొలియా భోమెరా సేతు నుంచి శీతాకాలపు ఉదయంలో కనిపించే హిమాలయాలు. తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, కాలుష్య రహిత వాతావరణ అద్భుతమైన పర్వతం అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అద్భుతం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కోలియా భోమోరా సేతు 1987లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. ఉత్తర ఒడ్డున సోనిత్ పూర్ జిల్లాలోని తేజ్పూర్ను దక్షిణ ఒడ్డుపై ఉన్న నాగోల్ జిల్లాలోని కలియాబోర్తో కలుపుతుంది. ఈ వంతెనకు అస్సామీ జనరల్ కాలియా భోమోరా ఫుకాన్ పేరు పెట్టారు. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
Another capture 👇
"So beautiful, So Elegant, Just Looking Like a WOW!" pic.twitter.com/XyzLEYJ1XW
— Himanta Biswa Sarma (@himantabiswa) November 12, 2023
తాజావార్తలు
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!