Himanta Biswa Sarma: ‘‘ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’.. అస్సాం సీఎం ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు ఉంది.
‘సో బ్యూటిఫుల్, సోలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అంటూ ఓ బట్టల దుకాణంలో మహిళ చేసిన సందడి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో జాస్మీన్ కౌర్ అనే మహిళ ఉత్సాహంగా సల్వార్ సూట్లను విక్రయిస్తున్న వీడియో ఈ డైలాగ్ చెప్పింది. ఇదే డైలాగ్ని ఉపయోగించి అస్సాం సీఎం ఓ వంతెన అందాన్ని వివరిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.
Also Read
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
Read Also: Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..
అస్సాంలోని తేజ్ఫూర్లోని కోలియా భోమెరా వంతెన అద్భుతమైన ఫోటోలు, వంతెనతో పాటు హిమాలయాల అందాలను తన పోస్టులో పంచుకుంటూ..‘‘సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’ అంటూ ట్వీట్ చేశారు. తేజ్పూర్ లోని కొలియా భోమెరా సేతు నుంచి శీతాకాలపు ఉదయంలో కనిపించే హిమాలయాలు. తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, కాలుష్య రహిత వాతావరణ అద్భుతమైన పర్వతం అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అద్భుతం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కోలియా భోమోరా సేతు 1987లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. ఉత్తర ఒడ్డున సోనిత్ పూర్ జిల్లాలోని తేజ్పూర్ను దక్షిణ ఒడ్డుపై ఉన్న నాగోల్ జిల్లాలోని కలియాబోర్తో కలుపుతుంది. ఈ వంతెనకు అస్సామీ జనరల్ కాలియా భోమోరా ఫుకాన్ పేరు పెట్టారు. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
Another capture 👇
"So beautiful, So Elegant, Just Looking Like a WOW!" pic.twitter.com/XyzLEYJ1XW
— Himanta Biswa Sarma (@himantabiswa) November 12, 2023
తాజావార్తలు
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!