Himanta Biswa Sarma: ‘‘ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’.. అస్సాం సీఎం ట్వీట్ వైరల్..
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు ఉంది.
‘సో బ్యూటిఫుల్, సోలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అంటూ ఓ బట్టల దుకాణంలో మహిళ చేసిన సందడి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో జాస్మీన్ కౌర్ అనే మహిళ ఉత్సాహంగా సల్వార్ సూట్లను విక్రయిస్తున్న వీడియో ఈ డైలాగ్ చెప్పింది. ఇదే డైలాగ్ని ఉపయోగించి అస్సాం సీఎం ఓ వంతెన అందాన్ని వివరిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..
అస్సాంలోని తేజ్ఫూర్లోని కోలియా భోమెరా వంతెన అద్భుతమైన ఫోటోలు, వంతెనతో పాటు హిమాలయాల అందాలను తన పోస్టులో పంచుకుంటూ..‘‘సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’ అంటూ ట్వీట్ చేశారు. తేజ్పూర్ లోని కొలియా భోమెరా సేతు నుంచి శీతాకాలపు ఉదయంలో కనిపించే హిమాలయాలు. తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, కాలుష్య రహిత వాతావరణ అద్భుతమైన పర్వతం అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అద్భుతం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కోలియా భోమోరా సేతు 1987లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. ఉత్తర ఒడ్డున సోనిత్ పూర్ జిల్లాలోని తేజ్పూర్ను దక్షిణ ఒడ్డుపై ఉన్న నాగోల్ జిల్లాలోని కలియాబోర్తో కలుపుతుంది. ఈ వంతెనకు అస్సామీ జనరల్ కాలియా భోమోరా ఫుకాన్ పేరు పెట్టారు. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
Another capture 👇
"So beautiful, So Elegant, Just Looking Like a WOW!" pic.twitter.com/XyzLEYJ1XW
— Himanta Biswa Sarma (@himantabiswa) November 12, 2023
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!