Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi: జార్ఖండ్లో ప్రభుత్వాన్ని దొంగలించేందుకు బీజేపీ ప్రయత్నించింది..
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్లో ప్రభుత్వాన్ని దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చని ఆదేశాలను కాపాడేందుకు కాంగ్రెస్ జోక్యం చేసుకుందని అన్నారు. -
Imran Khan: “ఇస్లాంకి విరుద్ధంగా పెళ్లి”.. ఇమ్రాన్ ఖాన్, భార్య బుష్రా బీబీకి ఏడేళ్లు జైలు శిక్ష..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి వరసగా అక్కడి కోర్టులు శిక్షల్ని విధిస్తున్నాయి. తాజాగా ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధంగా వివాహం చేసుకున్నాడనే కేసులో ఆయనకు, అతని భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు శనివారం 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2022 నుంచి ఇది ఇమ్రాన్ ఖాన్పై నాలుగో ఆరోపణ. అయితే, రెండు వరస వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం (ఇద్దత్) పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని ఆరోపిస్తూ బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ మనేకా కేసు నమోదు చేశాడు. -
Uttar Pradesh: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని.. ప్రియురాలి గొంతు నులిమి చంపిన వ్యక్తి..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకోరికి చెందిన బ్రిజేష్ మౌర్యను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకే నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు. -
Bharat Ratna Award Winners: రాజగోపాలాచారి నుంచి ఎల్కే అద్వానీ వరకు “భారతరత్న” అవార్డు పొందింది వీరే..
Bharat Ratna Award Winners: బీజేపీ కురువృద్ధులు, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ఈ రోజు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ని ప్రకటించింది. 1954న స్థాపించబడిని ఈ అవార్డు కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ, క్రీడలతో సహా వివిధ రంగాల్లో విశేష సేవ చేసినవారికి ప్రదానం చేస్తున్నారు. -
Bombay High Court: పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే అతనేం చేస్తాడు.. యువతి పిటిషన్ని కొట్టేసిన కోర్టు..
Bombay High Court: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి, తన ప్రేమికుడిపై వేసిన పిటిషన్ని బాంబే హైకోర్ట్ నాగ్పూర్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకుంటామనే ఆలోచన మేరకే శృంగారంలో పాల్గొన్నామని, అయితే, తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని సదరు యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. -
LK Advani: ‘‘నాకు మాత్రమే కాదు, నా ఆదర్శాలకు గౌరవం’’.. భారతరత్నపై ఎల్కే అద్వానీ..
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఈరోజు భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రదానం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, నా జీవితాంత నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరమని అన్నారు. 96 ఏళ్ల అద్వానీ తాను 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి సమయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ సిద్ధాంత గురువు ఆర్ఎస్ఎస్ అప్పగించిన ఏ… -
Delhi High Court: ఆర్థిక పరిమితికి మించి భార్య కోరికలు కోరడం.. భర్తను మానసిక ఒత్తిడికి గురిచేయడమే..
Delhi High Court: భర్త ఆర్థిక పరిమితికి మించి కోరికలు, కలలని నెరవేర్చాలని భార్య ఒత్తిడి చేయడం నిరంతర అసంతృప్తికి కారణమవుతుందని, చివరకు వైవాహిక జీవితంలో సంతోషం, సామరస్యానికి భంగం కలుగుతుందని, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా ఓ జంట విడాకుల కేసులో, విడాకులను సమర్థిస్తూ.. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. -
Pakistan: బిన్ లాడెన్ పాక్లో ఉన్నాడని అమెరికా ముందే చెప్పింది.. మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్లో అబోట్టాబాద్లో బిన్ లాడెన్ని చంపేశారు. తాజాగా జియో న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
LK Advani: భారతరత్న ఎల్కే అద్వానీ కంట కన్నీరు..
LK Advani: బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ఎల్కే అద్వానీకి ఈ అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ ఢిల్లీలోని ఆయన నివాసంలో లడ్డూ అందించి అభినందించారు. -
PM Modi: ట్రక్, టాక్సీ డ్రైవర్లకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. విశ్రాంతి కోసం ఆధునిక భవనాలు..
PM Modi: ట్రక్, టాక్సీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో మాట్లాడారు. ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి కొత్త సౌకర్యాలతో ఆధునిక భవనాలను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. లక్షలాది ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని, వారు తరుచు చాలా గంటలు పనిచేస్తారని, వారికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల…
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!