Mumbai: స్నేహితుడే కదా అని నమ్మి వచ్చినందుకు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనే కాకుండా అతని స్నేహితుడు కూడా రేప్ చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) క్వార్టర్స్లో నివసించే 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి హిందూమతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోవాలో శనివారం ది ఫ్యామిలీ లీడర్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామస్వామి తన భార్య అపూర్వ న్యూయార్క్ లోని మెడికల్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు, ఆమెకు గర్భస్రావం జరిగిందని, మొదటి బిడ్డను కోల్పోయామని, రెండోసారి కూడా గర్భస్రావం జరుగుతుందేమో అనే భయాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు.
CPI Narayana: సీపీఐ నారాయణ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. యువతకు పెద్ద పీట వేసేలా బీఆర్ఎస్, బీజపీ మ్యానిఫెస్టోలు లేవని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. యువతను బీజేపీ దగా చేస్తుందని, ఇన్ని ఏళ్లలో కనీసం కేసీఆర్ ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయిందని విమర్శించారు. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని, ఇప్పుడు బీసీని సీఎం చేస్తానని బీజేపీ చెబుతోందని అన్నారు. బీసీని సీఎం చేస్తానని చెబుతున్న బీజేపీ, బీసీ అధ్యక్షుడిని తొలగించిందని కామెంట్స్ చేశారు.
Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గాల వారీగా పర్యటనలు జరుపుతున్నారు. తమ స్టార్ క్యాంపెనర్లను రంగంలోకి దించుతున్నారు. హమీలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు వార్ నెలకొంది.
BJP vs Congress: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఈసారి రోహిత్ సేన వరల్డ్ కప్ తీసుకురావాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు సెలబ్రిటీలు టీం ఇండియాకు విషెస్ తెలుపుతున్నారు.
World Cup final: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచులో కలకలం రేగింది. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్ ధరించిన ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పిచ్ వద్దకు వచ్చి బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాను మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ సైన్యం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఫోకస్ పెట్టింది. శనివారం దక్షిణ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మంది మరణించారు. అంతకుముందు ప్రజల రక్షణ కోసం ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లాలని చెప్పిన ఇజ్రాయిల్, ఇప్పుడు అక్కడ హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తోంది.
Sanjay Raut: ఈ రోజు జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది. ఇండియన్ ఫ్యాన్స్ రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచు కోసం లక్షలాది మంది చేరుకున్నారు. దీనికి తోడు ప్రధాని మోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిఫ్యూటీ పీఎం, విదేశీ రాయబారులు, బాలీవుడ్ సెలబ్రెటీలు వస్తున్నారు. దీంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Shakib Al Hasan: 2024 జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు అక్కడి ఎన్నికల సంఘం ఇటీవల డేట్స్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విపక్షాలు ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడి విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
World Cup 2023: క్రికెట్ ఫ్యాన్ రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది.