Bangladesh: బంగ్లాదేశ్కు “పంది మలం”తో పండించిన మొక్కజొన్న.. నెటిజన్ల నుంచి సెటైర్లు..
- యూఎస్ మొక్కజొన్నను దిగుమతి చేసుకుంటున్న బంగ్లాదేశ్..
- పందిమలంతో పండిన పంటను కొనుగోలు చేయడంపై సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: రాజకీయ అస్థిరత, తీవ్ర మనోన్మాదంలో ఉన్న బంగ్లాదేశ్పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడమే. అయితే, దీంట్లో విమర్శించాల్సిన విషయం ఏమిటని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ మొక్కజొన్నను పండించడంలో ‘‘పంది మలం’’ వాడటంతో ఇది వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ నిర్ణయంపై చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో పంది మలాన్ని సాధారణ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే, ముస్లిం మెజారిటీ కలిగిన బంగ్లాదేశ్లో ఇది సమస్యగా మారింది.
సాధారణంగా ఇస్లాంలో పంది సంబంధిత ఉత్పత్తులను హరామ్(నిషిద్ధం)గా పరిగణిస్తారు. ఇటీవల, ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం, యూఎస్ మొక్కజొన్నను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తున్నట్లు పోస్ట్ చేసింది. “పోషక విలువలు ఎక్కువగా ఉన్న అమెరికన్ కార్న్ బంగ్లాదేశ్కు వస్తోంది. ఇది ఆహార పదార్థాలు, జంతు మేతకు ఉపయోగపడుతుంది” అని ట్వీట్ చేసింది. అయితే, ఈ పోస్ట్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కార్న్ సాగులో పంది మలాన్ని ఎరువుగా ఉపయోగిస్తారని ఎత్తిచూపుతూ సోషల్ మీడియా యూజర్లు బంగ్లాదేశ్ను ఎగతాళి చేయడం ప్రారంభించారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
‘‘డాన్(ట్రంప్) చేసిన తప్పుకు, బంగ్లాదేశ్కు అమెరికన్ మొక్కజొన్న లభిస్తుంది(పంది మలం ఎరువుతో సాగు చేసిన కార్న్). పాకిస్తాన్ గాజాకు ‘శాంతిపరిరక్షక దళాన్ని’ పంపుతోంది’’ అని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. అంకుల్ సామ్ బంగ్లాదేశ్ను నాశనం చేస్తున్నాడని, బంగ్లాదేశ్ ఇప్పుడు పంది ఎరువుతో సాగైన మొక్కజొన్నను తింటారు అని మరొకరు పోస్ట్ చేశారు.
బంగ్లాపై అమెరికా ఒత్తిడి:
ఈ సంవత్సరం ప్రారంభంలో, యుఎస్ ప్రారంభంలో బంగ్లాదేశ్పై 37% సుంకాలను విధించింది. యూఎస్-బంగ్లా మధ్య 6 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. అమెరికా సుంకాలు బంగ్లా వస్త్ర ఎగుమతుల్ని టార్గెట్ చేసింది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80 శాతం వాటా వస్త్రాలదే. అయితే, బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్ ఈ విషయమై, ట్రంప్కు లేఖ రాశారు. బంగ్లాదేశ్కు అమెరికా ఎగుమతుల్ని పెంచుతామని చెప్పారు . దీంతో అమెరికా, బంగ్లాపై సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. ఇందులో అమెరికన్ గోధుమలు, మొక్కొజొన్న, సోయాబీన్ కూడా ఉన్నాయి. ఇటీవల, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. 2,20,000 మెట్రిక్ టన్నుల యూఎస్ గోధుమల్ని కొనుగోలు చేయడానికి బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!