Israel-Hamas War: బందీల విడుదలపై ఒప్పందం.. ఇజ్రాయిల్ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాను మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ సైన్యం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఫోకస్ పెట్టింది. శనివారం దక్షిణ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మంది మరణించారు. అంతకుముందు ప్రజల రక్షణ కోసం ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లాలని చెప్పిన ఇజ్రాయిల్, ఇప్పుడు అక్కడ హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తోంది.
మరోవైపు అక్టోబర్7 నాటి దాడిలో 1400 మందిని చంపిన హమాస్ ఉగ్రవాదులు, 240 మందిని బందీలుగా తీసుకున్నారు. అయితే బందీల విడుదలపై ఇతర దేశాల మధ్యవర్తిత్వంపై చర్చలు జరుగుతున్నాయి. ఖతార్ ఈ చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 5 రోజలు కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో 50 మంది వరకు బందీలను విడుదల చేస్తారని ఒప్పందానికి వచ్చారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ‘‘ఖతార్ మధ్యవర్తిత్వ చర్చలు పురోగతికి వచ్చాయని ఇజ్రాయిల్, హమాస్ కనీసం 5 రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తాయని, తొలుత 50 మంది లేదా అంతకన్నా ఎక్కువ బందీలను, ప్రతీ 24 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున విడుదల చేస్తారు’’ అని తెలిపింది.
Also Read
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
Read Also: Sanjay Raut: ‘‘మోడీ బౌలింగ్.. అమిత్ షా బ్యాటింగ్’’.. సంజయ్ రౌత్ సెటైర్లు..
అయితే అలాంటి ఒప్పందం ఏం కుదరలేదని ఇజ్రాయిల్, అమెరికా రెండూ తెలిపాయి. దీనిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ఇలాంటి ఒప్పందం ఏం లేదని అన్నారు. మేము బందీలుగా ఉన్నవారందరిని విడిపించాలని అనుకుంటున్నామని అన్నారు. మేము స్పష్టంగా బందీలను వారి కుటుంబాల వద్దకు చేర్చాలని అనుకుంటున్నామని చెప్పారు. ‘‘మేం ఇంకా ఏం ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని వైట్హౌజ్ నేషనల్ సెక్యురిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
మరోవైపు హమాస్ పై పోరులో విరామం ఇస్తే వారు మళ్లీ బలపడే అవకాశం ఉందని ఇజ్రాయిల్ సైన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ సైన్యం, ప్రభుత్వం ఇప్పటి వరకు క్రమక్రమంగా దాడులను పెంచుతుందే తప్పితే, కాల్పుల విరమణ పాటించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 11,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఇందులో 5000 మంది చిన్నారులు ఉండటంపై ప్రపంచదేశాలు కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి.
తాజావార్తలు
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..