Venu Goapl Reddy
Author- NTV Telugu-
BJP: గౌతమ్ గంభీర్ తర్వాత బీజేపీకి మరో ఎంపీ షాక్..
BJP: బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రి పనిచేశారు, హజారీబాగ్కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. -
PM Modi: టీఎంసీ దౌర్జన్యాలు, ద్రోహానికి పర్యాయపదం.. మమత పార్టీపై పీఎం ఫైర్..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు. -
Nitish Kumar: “ప్రధాని మోడీని ఇక విడిచి పోయేది లేదు”..ఎన్డీయేతోనే ఉంటానన్న సీఎం నితీష్ కుమార్..
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎతో కలిసి ఉంటానని, ఎక్కడికి వెళ్లనని నితీస్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ప్రధాని మోడీ చిరునవ్వు చిందించారు. బీహార్ ఔరంగాబాద్లో జరిగిన బహిరంగం సభలో నితీష్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఇంతకముందు బీహార్ వచ్చారు, కానీ నేను మీతో లేను, ఇప్పుడు నేను మీతో ఉన్నారు, నేను ఇక ఎక్కడి వెళ్లనని మీకు హామీ ఇస్తున్నా’’ అని… -
Google: కేంద్రం జోక్యంతో భారతీయ యాప్ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్..
Google: సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం. -
26/11 Mumbai Attack: ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆజం చీమా పాక్లో మృతి..
26/11 Mumbai Attack: 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) ఉగ్రసంస్థ టెర్రిరిస్ట్ ఆజం చీమా(70) పాకిస్తాన్లో మరణించినట్లు తెలుస్తోంది. 2008లో ముంబైపై ఉగ్రదాడిలో ఇతను కీలకంగా వ్యవహిరంచాడు. 70 ఏళ్ల వయసులో పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో గుండె పోటుతో మరనించాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్గా ఉన్న చీమా 26/11 ముంబై ఎటాక్స్, జూలై 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు. -
Breaking News: ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా..
Breaking News: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. -
Gangster: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్, ఆర్ఎస్ఎస్ నేత హత్యలో నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్..
Gangster: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక వ్యక్తి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. నియాజీపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. 2016లో బెంగళూర్లో ఆర్ఎస్ఎస్ నేత రుద్రేష్ని హత్య చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత నియాజీ విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఇతడి కోసం వెతుకుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలో పట్టుబడటం ఎన్ఐఏకి గొప్ప విజయంగా చెప్పవచ్చు. -
Nuclear Cargo: చైనా నుంచి పాక్ వెళ్తున్న నౌకని ముంబైలో నిలిపివేత.. “అణు కార్గో” ఉన్నట్లు అనుమానం..
Nuclear Cargo: చైనా నుంచి పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తున్న ఓ కార్గో నౌకను భారత అధికారలు ముంబై పోర్టులో అడ్డుకున్నారు. పాకిస్తాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల కోసం వినియోగించే సరకు ఉందనే అనునమానంతో ముంబై నవ షేవా నౌకాశ్రయంలో భారత అధికారులు శనివారం నిలిపేశారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా.. జనవరి 23న కరాచీకి వెళ్లే మార్గంలోని వెళ్తున్న సీఎంఎ సీజీఎం అట్టిలా నౌకను నిలిపేశారు. నౌకలో ఉన్న సరుకును పరిశీలించారు. ఇందులో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) అనే యంత్రం ఉన్నట్లు, ఇది… -
Rameshwaram Cafe Blast: మంగళూర్, బెంగళూర్ పేలుళ్లకు లింక్.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో 10 మంది గాయపడ్డారు. పథకం ప్రకారమే నిందితుడు ఐఈడీ బాంబుకు టైమర్ని అమర్చి పేల్చినట్లు తెలుస్తోంది. 2022 మంగళూర్లో జరిగిన ప్రెషర్ కుక్కర్ పేలుడుకు, తాజాగా జరిగిన బెంగళూర్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం అన్నారు. బెంగళూర్ లోని ఐటీ కారిడార్లోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలో ఈ… -
Udhayanidhi Stalin vs Annamalai: మీరు డీఎంకేని టచ్ చేయలేరు.. నువ్వో విఫల నటుడివి..
Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28 పైసా మోడీ’ అంటై ప్రధానిని విమర్శించారు.
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!