Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యకు కుట్ర.. వచ్చే వారం భారత్ రానున్న ఎఫ్బీఐ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికన్ పౌరుడైన పన్నూని హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, అతనికి ఓ భారత ప్రభుత్వ ఉద్యోగితో సంబంధాలు ఉన్నాయని అమెరికా న్యాయశాఖ నేరాభియోగ పత్రంలో పేర్కొంది. అయితే అమెరికన్ పౌరుడిని, అమెరికన్ గడ్డపై హత్య చేయడానికి ప్లాన్ చేయడాన్ని బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సంఘటను భారత్ ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో లేవనెత్తామని అమెరికన్ అధికారులు చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే ఈ కుట్రలో భారత్తో సంబంధం ఉన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే వచ్చే వారం భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పర్యటన గురించి వెల్లడించారు.
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
Read Also: Congress: ముందైతే పీఓకే నుంచి ఒక యాపిల్ తీసుకురండి.. అమిత్ షా “నెహ్రూ” వ్యాఖ్యలపై అధిర్ రంజన్..
అమెరికా అత్యున్నత అధికారుల భారతదేశ సందర్శన గురించి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ… యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారతదేశానికి 4 సార్లు వచ్చారని, యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ మూడు సార్లు, యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ రెండుసార్లు భారత్కి వచ్చారని, ఎఫ్బీఐ డైరెక్టర్ వచ్చే వారం భారత్ వస్తున్నారని ఆయన చెప్పారు.
భారత సీనియర్ భద్రతాధికారుతో వ్రే చర్చలు జరుపుతారని తెలుస్తోంది. సిక్కు వేర్పాటువాద నేత, అమెరికన్-కెనడా ద్వంద్వం పౌరసత్వం కలిగిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై సీఐఏ చీఫ్ విలియం బర్న్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్లను బైడెన్ ప్రభుత్వం ఇండియాకు పంపినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. ఈ హత్యకు కుట్ర పన్నిన వారిని పట్టుకోవాలని భారత్కి సూచించినట్లు తెలిపింది.
US ప్రిన్సిపల్ డిప్యూటీ NSA జోనాథన్ ఫైనర్ ఈ వారం భారతదేశాన్ని సందర్శించారు, ఈ సందర్భంగా ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, NSA అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు డిప్యూటీ NSA విక్రాన్ మిస్రీలతో చర్చలు జరిపారు. ఈ కుట్రపై బాధ్యుల్ని పట్టుకోవాలని, వారిని జవాబుదారీగా చేయాలని భారత్కి చెప్పినట్లు వైట్హౌజ్ తెలిపింది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!