Mahua Moitra: మహువా మోయిత్రా ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసు.. రేపు పార్లమెంట్ ముందుకు ఎథిక్స్ ప్యానెల్ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని, క్యాఫ్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న కేసులో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. మెజారిటీ సభ్యులు ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రేపు పార్లమెంట్ ముందుకు ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు రాబోతున్నట్లు సమాచారం. ఈ నివేదికపై డివిజన్ ఓట్లు అడగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఈ నివేదిక పార్లమెంట్ ముందుకు వస్తున్న క్రమంలో తన సభ్యులంతా సిద్ధంగా ఉండాలని బీజేపీ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.
Read Also: Allu Arha: తిరుపతిలో అల్లు కోడలు.. కెమెరా కంటికి కనిపించకుండా అల్లరి చేసిన అర్హ
Also Read
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అదానీని టార్గెట్ చేస్తూ మహువా మోయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని, ఇందుకోసం వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, గిప్టులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీంతో పాటు ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఆమెను విచారించింది. తాను ఇతరులతో లాగిన్ వివరాలను పంచుకున్నట్లు మహువా అంగీకరించింది. ఇదిలా ఉంటే దర్శన్ హీరానందానీ కూడా ఎథిక్స్ ప్యానెల్కి అఫిడవిట్ సమర్పించారు, ఇందులో మహువా మోయిత్రా తన నుంచి గిఫ్టులు తీసుకుందని వెల్లడించారు.
ఎంపీగా ఉన్న మోయిత్రా పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎథిక్స్ కమిటీ నివేదికను కోరింది. ఈ నేపథ్యంలో ఆమెపై కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతిపక్షాలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. తనపై కేంద్రంలోని బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని మోయిత్రా ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!