Mamata Banerjee: ఎన్నికల ముందు మమత కొత్త స్ట్రాటజీ.. ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ఎన్నికల ముందు మమత కొత్త స్ట్రాటజీ
- ప్రముఖ దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం!
- అధికారం కోసం బీజేపీ కూడా వ్యూహాలు
- ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
త్వరలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలు ఒకెత్తు అయితే.. పశ్చిమ బెంగాల్ మరొకెత్తు. బెంగాల్లో ఎప్పటి నుంచో పాగా వేయాలని కాషాయ పార్టీ కలలు కంటోంది. కానీ సాధ్యపడలేదు. ఈసారైనా బెంగాల్లో బీజేపీ జెండా పాతాలని మేథోమధనం చేస్తోంది. ఇంకోవైపు నాలుగోసారి అధికారాన్ని స్థిరపరుచుకోవాలని మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తోంది. ఇలా బీజేపీ వర్సెస్ మమత మధ్య వ్యూహాలు-ప్రతివ్యూహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య భీకర పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆలయాల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు మమత ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
ఇది కూడా చదవండి: Zohran Mamdani: న్యూయార్క్ మేయర్గా మమ్దానీ ప్రమాణం.. దేనిపై ప్రమాణం చేశారంటే..!
ఇటీవల మమతా బెనర్జీ ఆలయాల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. బీజేపీ నుంచి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లుగా సమాచారం. ఈ ఏడాదిలోనే దిఘాలో జగన్నాథ ఆలయ పనులు ప్రారంభించారు. కోల్కతాలోని న్యూటౌన్లో దుర్గా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక ఉత్తర బెంగాల్లోని సిలిగురిలో మహాకాళ్ ఆలయ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. 17 ఎకరాల్లో దుర్గా అంగన్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనపై చాలా మంది ఆరోపణలు చేస్తారని.. బుజ్జగింపు రాజకీయాలు చేస్తానని నిందిందిస్తారని వ్యాఖ్యానించారు. వాస్తవంగా తాను లౌకికవాదిని అని చెప్పుకొచ్చారు. తాను అన్ని మతాలను నమ్ముతానని.. శాంతియుత సహజీవనాన్ని విశ్వసిస్తానని చెప్పుకొచ్చారు. అయినా తాను హాజరుకాని ఏ వేడుకలు ఉన్నాయని మమత ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Zelensky: రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్స్కీ కీలక ప్రకటన
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఒక సీనియర్ నేత మాట్లాడుతూ.. ముస్లింలను సంతృప్తిపరిచే పార్టీగా తమపై ఎప్పుడూ బీజేపీ ముద్ర వేస్తోందని.. అలా ప్రయత్నం చేస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్మాణంతో ఆ విమర్శ పోతుందని.. అన్ని విశ్వాసాలను గౌరవించే నాయకురాలిగా మమత ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు.
ఇక బీజేపీ కూడా మమతకు ధీటుగా ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!