Mamata Banerjee: ఎన్నికల ముందు మమత కొత్త స్ట్రాటజీ.. ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ఎన్నికల ముందు మమత కొత్త స్ట్రాటజీ
- ప్రముఖ దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం!
- అధికారం కోసం బీజేపీ కూడా వ్యూహాలు
- ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలు ఒకెత్తు అయితే.. పశ్చిమ బెంగాల్ మరొకెత్తు. బెంగాల్లో ఎప్పటి నుంచో పాగా వేయాలని కాషాయ పార్టీ కలలు కంటోంది. కానీ సాధ్యపడలేదు. ఈసారైనా బెంగాల్లో బీజేపీ జెండా పాతాలని మేథోమధనం చేస్తోంది. ఇంకోవైపు నాలుగోసారి అధికారాన్ని స్థిరపరుచుకోవాలని మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తోంది. ఇలా బీజేపీ వర్సెస్ మమత మధ్య వ్యూహాలు-ప్రతివ్యూహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య భీకర పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆలయాల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు మమత ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ఇది కూడా చదవండి: Zohran Mamdani: న్యూయార్క్ మేయర్గా మమ్దానీ ప్రమాణం.. దేనిపై ప్రమాణం చేశారంటే..!
ఇటీవల మమతా బెనర్జీ ఆలయాల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. బీజేపీ నుంచి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లుగా సమాచారం. ఈ ఏడాదిలోనే దిఘాలో జగన్నాథ ఆలయ పనులు ప్రారంభించారు. కోల్కతాలోని న్యూటౌన్లో దుర్గా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక ఉత్తర బెంగాల్లోని సిలిగురిలో మహాకాళ్ ఆలయ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. 17 ఎకరాల్లో దుర్గా అంగన్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనపై చాలా మంది ఆరోపణలు చేస్తారని.. బుజ్జగింపు రాజకీయాలు చేస్తానని నిందిందిస్తారని వ్యాఖ్యానించారు. వాస్తవంగా తాను లౌకికవాదిని అని చెప్పుకొచ్చారు. తాను అన్ని మతాలను నమ్ముతానని.. శాంతియుత సహజీవనాన్ని విశ్వసిస్తానని చెప్పుకొచ్చారు. అయినా తాను హాజరుకాని ఏ వేడుకలు ఉన్నాయని మమత ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Zelensky: రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్స్కీ కీలక ప్రకటన
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఒక సీనియర్ నేత మాట్లాడుతూ.. ముస్లింలను సంతృప్తిపరిచే పార్టీగా తమపై ఎప్పుడూ బీజేపీ ముద్ర వేస్తోందని.. అలా ప్రయత్నం చేస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్మాణంతో ఆ విమర్శ పోతుందని.. అన్ని విశ్వాసాలను గౌరవించే నాయకురాలిగా మమత ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు.
ఇక బీజేపీ కూడా మమతకు ధీటుగా ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?