India: “వారు మాకు మోస్ట్ వాంటెడ్”.. పాక్లో ఉగ్రవాదుల హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: పాకిస్తాన్లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.
‘‘ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వారు భారత న్యాయవ్యవస్థను ఎదుర్కోవాలని మేము కోరుకుంటున్నాము.. అయితే పాకిస్తాన్లో జరిగిన పరిణామాలపై నేను వ్యాఖ్యానించ లేను’’ అని అరిందమ్ బాగ్చీ అన్నారు. 2015 జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ బీఎస్ఎఫ్ కాన్వాయ్పై దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది హంజ్లా అద్నాన్న్ ఇటీవల కరాచీలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డారు. డిసెంబర్ 2 మధ్యరాత్రి వేళల్లో హంజ్లా అద్నాన్ తన ఇంటిలోనే కాల్చి చంపబడ్డాడు. ఇలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: TS Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్
డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం ఎల్లప్పుడూ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అన్నారు. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే యూఎస్, కెనడా అధికారులకు చెప్పామని, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక సమస్యపై మీడియా కవరేజీ కోరుకునేందుకే ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు.
మరోవైపు ఖతార్ ప్రభుత్వం భారత మాజీ నేవీ అధికారులు 8 మందికి మరణశిక్ష విధించడంపై మాట్లాడుతూ.. ఈ విషయాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని, అన్ని చట్టపరమైన, కాన్సులర్ సాయాన్ని అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న 8 మందిని కలవడానికి మా రాయబారికి యాక్సెస్ లభించిందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!