India: “వారు మాకు మోస్ట్ వాంటెడ్”.. పాక్లో ఉగ్రవాదుల హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: పాకిస్తాన్లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.
‘‘ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వారు భారత న్యాయవ్యవస్థను ఎదుర్కోవాలని మేము కోరుకుంటున్నాము.. అయితే పాకిస్తాన్లో జరిగిన పరిణామాలపై నేను వ్యాఖ్యానించ లేను’’ అని అరిందమ్ బాగ్చీ అన్నారు. 2015 జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ బీఎస్ఎఫ్ కాన్వాయ్పై దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది హంజ్లా అద్నాన్న్ ఇటీవల కరాచీలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డారు. డిసెంబర్ 2 మధ్యరాత్రి వేళల్లో హంజ్లా అద్నాన్ తన ఇంటిలోనే కాల్చి చంపబడ్డాడు. ఇలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
Read Also: TS Cabinet Meeting: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్
డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం ఎల్లప్పుడూ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అన్నారు. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే యూఎస్, కెనడా అధికారులకు చెప్పామని, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక సమస్యపై మీడియా కవరేజీ కోరుకునేందుకే ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు.
మరోవైపు ఖతార్ ప్రభుత్వం భారత మాజీ నేవీ అధికారులు 8 మందికి మరణశిక్ష విధించడంపై మాట్లాడుతూ.. ఈ విషయాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని, అన్ని చట్టపరమైన, కాన్సులర్ సాయాన్ని అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న 8 మందిని కలవడానికి మా రాయబారికి యాక్సెస్ లభించిందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.