Delhi: ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. బుధవారం రాత్రి 11.30 గంటలకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీ, వాయువ్య మధ్యప్రదేశ్లోకి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక తల్లి ‘లివ్ ఇన్ పార్ట్నర్’ అని పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ నివాసి అంకిత్ యాదవ్(29) అనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్)
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. రామ మందిర ఆలయ గుర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Iran's strikes in Pakistan: పాకిస్తాన్పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.
Karnataka: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్నా కొద్ది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రాజన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండు బొమ్మల్ని టెంటులో ఉంచి వాటినే రాముడని అన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Corbevax: భారత తయారీ కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చింది. కార్బెవాక్స్ టీకాను హైదరాబాద్కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ E లిమిటెడ్ తయారు చేసింది. దీనిపై బయోలాజికల్ E డైరెక్టర్ మహిమా దాట్ల మాట్లాడుతూ..WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) పట్ల మేము సంతోషంగా ఉన్నామని, ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా మా ప్రపంచ పోరాటాన్ని బలపరుస్తుందని అన్నారు.
Military Strength Ranking: ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా అమెరికా తొలిస్థానంలో నిలిచింది. రష్యా, చైనాలు వరసగా రెండూ, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 4వ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్సైట్ గ్లోబల్ ఫైర్పవర్ 2024కి గానూ
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
Direct-to-Mobile: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా వీడియోలు చూసే రోజులు త్వరలో రాబోతున్నాయి. సమీప భవిష్యత్తులో డైరెక్ట్-టూ-మొబైల్ ప్రసారాలు నిజం అయ్యే అవకాశం ఉంది. బ్రాడ్కాస్టింగ్ సమ్మిట్ని ఉద్దేశిస్తూ సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. డైరెక్ట్-టూ-మొబైల్(D2M) సాంకేతికత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
Flight Delay: పొగమంచు, వాతావరణ పరిస్థితులు దేశంలో విమానయానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో పొగమంచు పరిస్థితులు వందల సంఖ్యలో విమానాల రాకకు అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అవస్థలు పడ్డారు. ఏకంగా కొందరు ప్రయాణికలు విమాన సిబ్బందిపై దాడులు చేయడమే చేయడం, ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేయడం వైరల్గా మారాయి.