Sharad Pawar: కీలక రామ మందిర వేడుకని రాజీవ్ గాంధీ జరిపారు.. బీజేపీది రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిరి ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముందు ప్రధాని నరేంద్రమోడీ 11 రోజల పాటు ఉపవాసదీక్షను ప్రారంభించారు. అయితే దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. రాముడిపై ఆయనకున్న నమ్మకాన్ని నేను గౌరవిస్తాను, కానీ పేదరిక నిర్మూలన కోసం ఆయన ఉపవాసం పాటించాలని నిర్ణయించుకుంటే, ప్రజలు దానిని మెచ్చుకునే వారని అన్నారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Nepal: త్రిశూలి నదిలో పడిపోయిన ఇండియా నంబర్ ప్లేట్ ఉన్న జీపు.. ప్రాణనష్టమేమీ లేదు..!
రామ మందిర ప్రారంభోత్సవ వేడుక బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. ఈ వేడుక కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్టు ఆహ్వానం పంపింది. అయితే ఇది పూర్తిగా బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమమని మేం హాజరుకాబోవడం లేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రామ మందిర వేడుక ‘మోడీ ఫంక్షన్’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఆర్జేడీ, టీఎంసీ వంటి పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు ఎక్కు పెట్టాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోందని బీజేపీ ధ్వజమెత్తుతోంది.
జనవరి 22న జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుక కోసం ఆలయ ట్రస్టు దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు, సాధువులకు ఆహ్వానం అందించింది. ఈ రోజు నుంచి అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!