Sharad Pawar: కీలక రామ మందిర వేడుకని రాజీవ్ గాంధీ జరిపారు.. బీజేపీది రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిరి ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముందు ప్రధాని నరేంద్రమోడీ 11 రోజల పాటు ఉపవాసదీక్షను ప్రారంభించారు. అయితే దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. రాముడిపై ఆయనకున్న నమ్మకాన్ని నేను గౌరవిస్తాను, కానీ పేదరిక నిర్మూలన కోసం ఆయన ఉపవాసం పాటించాలని నిర్ణయించుకుంటే, ప్రజలు దానిని మెచ్చుకునే వారని అన్నారు.
Also Read
Read Also: Nepal: త్రిశూలి నదిలో పడిపోయిన ఇండియా నంబర్ ప్లేట్ ఉన్న జీపు.. ప్రాణనష్టమేమీ లేదు..!
రామ మందిర ప్రారంభోత్సవ వేడుక బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. ఈ వేడుక కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్టు ఆహ్వానం పంపింది. అయితే ఇది పూర్తిగా బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమమని మేం హాజరుకాబోవడం లేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రామ మందిర వేడుక ‘మోడీ ఫంక్షన్’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఆర్జేడీ, టీఎంసీ వంటి పార్టీలు కూడా బీజేపీపై విమర్శలు ఎక్కు పెట్టాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోందని బీజేపీ ధ్వజమెత్తుతోంది.
జనవరి 22న జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుక కోసం ఆలయ ట్రస్టు దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు, సాధువులకు ఆహ్వానం అందించింది. ఈ రోజు నుంచి అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!