CM Revanth Reddy : కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
- కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్పై చర్చించిన సీఎం రేవంత్
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో బయటపెట్టాలన్న సీఎం రేవంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నదీ జలాల పంపిణీ , పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ నేతలు బహిష్కరించి వెళ్లిన నేపథ్యంలో, ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
Also Read
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో గత పదేళ్లలో జరిగిన జాప్యం, ఎదురైన ఆటంకాలపై వాస్తవాలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేస్తూ అంగీకరించడం వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు జరిగిన నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్తో కొనసాగుతున్న జల వివాదాలు, కృష్ణా జలాల పంపిణీ అంశాలపై నాయకులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను వివరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Off The Record: ఆ మంత్రికి పదవి మూన్నాళ్ళ ముచ్చటేనా? మాజీ క్రికెటర్ ఆశలు అడియాశలేనా?
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?