Delhi: ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు.. పలు విమానాలు రద్దు.. రైళ్లు ఆలస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. బుధవారం రాత్రి 11.30 గంటలకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీ, వాయువ్య మధ్యప్రదేశ్లోకి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
పొగమంచు కారణంగా ఢిల్లీలో విజిబిలిటీ తగ్గింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో మరోసారి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తర, ఈశాన్య భారతదేశాల్లో పొగమంచు కారణంగా గత 15 రోజలు నుంచి రోడ్డు, రైలు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ రోజు కూడా పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి రావాల్సిన 18 రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి.
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
Read Also: Delhi: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి “లివ్-ఇన్ పార్ట్నర్” అఘాయిత్యం..
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తగ్గాయి. బుధవారం పంజాబ్లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని బలోవల్ సౌంఖ్రీలో సున్నా డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ నివేదిక తెలిపింది. అమృత్సర్లో 2 డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా నమోదైంది, లూథియానా మరియు పాటియాలాలో వరుసగా 2.8 మరియు 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హర్యానాలోని కర్నాల్లో 3.4 డిగ్రీలు, అంబాలా, హిసార్, నార్నాల్, రోహ్తక్లలో 4.9, 5.8, 3.5, 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది.
18 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 18th January. pic.twitter.com/5AYjHyAz7z
— ANI (@ANI) January 18, 2024
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..