Direct-to-Mobile: సిమ్, ఇంటర్నెట్ లేకున్నా సెల్ఫోన్లలో వీడియోలు.. కేంద్రం బిగ్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Direct-to-Mobile: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా వీడియోలు చూసే రోజులు త్వరలో రాబోతున్నాయి. సమీప భవిష్యత్తులో డైరెక్ట్-టూ-మొబైల్ ప్రసారాలు నిజం అయ్యే అవకాశం ఉంది. బ్రాడ్కాస్టింగ్ సమ్మిట్ని ఉద్దేశిస్తూ సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. డైరెక్ట్-టూ-మొబైల్(D2M) సాంకేతికత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
D2M సాంకేతికత ట్రయల్స్ త్వరలో 19 నగరాల్లో జరుగుతాయని, దీని కోసం 470-582 MHz స్పెక్ట్రమ్ను రిజర్వ్ చేయడానికి కార్యాచరణ రూపొందించామని ఆయన వెల్లడించారు. 25-30 శాతం వీడియో ట్రాఫిక్ని D2M మార్చడం వల్ల ఆటంకం లేకుండా 5G నెట్వర్క్ని పొందొచ్చని, దీనివల్ల దేశ డిజిటల్ పరిణామం మరింత వేగవంతమవుతుందని అపూర్వ చంద్ర అన్నారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
Read Also: Flight Delay: ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్స్.. ఫ్లైట్స్ ఆలస్యంపై కేంద్రం ప్రణాళిక..
గతేడాది D2M సాంకేతికతను పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్టులు బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో జరిగాయి. ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా 8-9 కోట్ల టీవీలు లేని ఇళ్లకు చేరుకోవడానికి సాయపడుతుందని, దేశంలో 280 మిలియన్ కుటుంబాల్లో కేవలం 190 మిలియన్ కుటుంబాల్లోనే టీవలు ఉన్నాయి. దేశంలో 80 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్ లో ఉందని చెప్పారు. వీడియోలను ఎక్కువ ఉపయోగించడం వల్ల మొబైల్ నెట్వర్క్ స్లో అవుతోందని, దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని వెల్లడించారు.
సాంఖ్యాల్యాబ్, ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన D2M టెక్నాలజీ టెరిటోరియల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అసైన్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్స్ నేరుగా దీనిని సపోర్ట్ చేసే మొబైల్స్, స్మార్ట్ ఫోన్లకు చేరడానికి ఉపయోగిపడుతుంది. ఒక బిలియన్ మొబైల్ ఫోన్లకు చేరుకోగల సామర్థ్యంతో, D2M టెక్నాలజీని స్వీకరించడం వల్ల డేటా ట్రాన్స్మిషన్, డేటా యాక్సెస్ ఖర్చు తగ్గుతుంది. నెట్వర్క్ సామర్థ్యం పెరగడంతో పాటు నేషనల్ అలర్ట్ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడాన్ని సులభతరం చేస్తుంది.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!