Venu Goapl Reddy
Author- NTV Telugu-
Darshan Case: దర్శన్ని భయపెడుతున్న రేణుకాస్వామి ఆత్మ..
Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతని అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్కి దూరంగా కాంగ్రెస్, బీజేపీ..
Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్లో ఇటు బీజేపీ కానీ, అటు ఎన్సీ- కాంగ్రెస్ కూటమి కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేవని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుంటే, కాశ్మీర్లోయలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. అయితే, మొత్తం జమ్మూ కాశ్మీర్లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 46 మ్యాజిక్ ఫిగర్. ఏ కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్ని సాధించలేవని సర్వేలు చెబుతున్నాయి. -
Haryana Exit Poll 2024: హర్యానా కాంగ్రెస్ హస్తగతం.. బీజేపీకి హ్యట్రిక్ ఆశలు గల్లంతు.
Haryana Exit Poll 2024: లోక్సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్. ఈ సంఖ్య చేరుకున్న పార్టీలు ప్రభుత్వాన్ని… -
Bangladesh: ఢాకాలో వేలసంఖ్యలో హిందువుల నిరసన.. ప్రభుత్వానికి 8 డిమాండ్లు..
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, ఆమె రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. -
Pakistan: “ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనండి”.. జైశంకర్కి పాకిస్తాన్ నేత ఆహ్వానం..
Pakistan: అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (SCO-CHG) సమావేశానికి భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్లోని డీ-చౌక్లో నిరసనలకు ప్లాన్ చేశారు. -
Congress: కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..
Congress: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. “వెయిటర్” ఉద్యోగం కోసం బారులు..
కెనడాలో ఓ రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగం కోసం భారతీయ విద్యార్థులు దాని ముందు బారులు తీరిన వీడియోని చూస్తే, పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల కోసం వరసలో ఉ -
Yasin Malik: “నేనిప్పుడు మారిపోయా, గాంధేయవాదిని”.. ఉగ్రవాది యాసిన్ మాలిక్..
Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాద నేత, పలు ఉగ్రవాద ఘటనలో సంబంధం ఉన్న యాసిన్ మాలిక్ తాను 1994 నుంచి హింసను విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఐక్య, స్వతంత్ర కాశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. -
PM Narendra Modi: డ్రగ్స్ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
దేశంలోని యువతను డ్రగ్స్ వైపు నెట్టాలని, ఈ దందాలో వచ్చే డబ్బులను ఎన్నికలో వినియోగించి, గెలవాలని ఆ పార్టీ కోరుకుంటోందని ఆరోపించారు. అక్టోబర్ 02న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్లోని ఓ గోడౌన్లో ఢిల్లీ పోలీసులు 560 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5620 కోట్లగా అంచనా వేశారు. -
West Bengal: ట్రైనీ డాక్టర్ ఘటన మరవక ముందే.. బెంగాల్లో మైనర్ బాలికపై దారుణం..
West Bengal: పశ్చిమ బెంగాల్లో మైనర్ బాలిక కిడ్నాప్, హత్య సంచలనంగా మారింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో కోచింగ్ క్లాస్కి హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక హత్యకి గురైంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిరసనకారులు బాలిక హత్యకు నిరసనగా పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. అయితే, బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశారని బీజేపీతో సహా బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు బాలిక పోస్టుమార్టం నివేదిక కోసం వేచిచూస్తున్నారు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?