BJP: అవార్డులు కావాలంటే సౌదీ వెళ్లండి.. మదర్సా విద్యార్థులపై బీజేపీ నేత..
- మదర్సా విద్యార్థులకు సత్కరించకపోవడంపై యూపీలో వివాదం..
- బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు..
- అవార్డులు కావాలంటే సౌదీ వెళ్లాలన్న బీజేపీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఉత్తర్ ప్రదేశ్లో మదర్సా విద్యార్థులకు అవార్డులు ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల నేతలు అధికార బీజేపీని విమర్శిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అవార్డులు కావాలంటే సౌదీ అరేబియా వెళ్లి పొందొచ్చని ఆయన అన్నారు. సంస్కృతం, రాష్ట్ర బోర్డ్ స్కూల్స్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థలును ప్రభుత్వం గౌరవించిందని, మదర్సాలో చదువుతున్న విద్యార్థులును ఎందుకు గౌరవించలేదని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీఎం యోగి ప్రభుత్వం అన్ని మతాలను సమానరక్షణ కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ నినాదం ఇచ్చిన ప్రభుత్వం మదర్సా బోర్డు పిల్లలను ఎందుకు అవార్డులతో సత్కరించడం లేదు అని సేలంపూర్ ఎంపీ, ఎస్పీ నేత రామశకర్ రాజ్భర్ అడిగారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ రాజ్యంగం అన్ని మతాలను, భాషలను పరిరక్షిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత మొహ్సిన్ రజా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘మత విద్యలో పురోగతి’’ కోసం ఎలాంటి అవార్డులు ఇవ్వరని స్పష్టం చేశారు. అలాంటి అవార్డులు కావాలంటే సౌదీ అరేబియా వెళ్లి తెచ్చుకోవాలని సూచించారు.
ఇటీవల యూపీ ప్రభుత్వం 10, 12వ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష నగదు బహుమతిని ప్రకటించింది. యుపి బోర్డ్ ఆఫ్ సెకండరీ సంస్కృత ఎడ్యుకేషన్ కౌన్సిల్, సిబిఎస్ఇ మరియు సిఐఎస్సిఇ పరీక్షలలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని కూడా సత్కరిస్తున్నారు. అవార్డుల కోసం ప్రభుత్వం రూ.4.73 కోట్లు కేటాయించింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!