Amit Shah: కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకమే..
- కాంగ్రెస్ లక్ష్యంగా అమిత్ షా ధ్వజం..
- ఆ పార్టీ ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకమే అని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్గా కేంద్ర హోం మంత్రి విమర్శలు గుప్పించారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో మంగళవారం పర్యటించిన ఆయన, కాంగ్రెస్ని లక్ష్యంగా చేసుకున్నారు. మహేంద్రగఢ్లో జరిగిన ‘‘బీసీ సమ్మాన్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు. ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు 1950లలో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ ఏళ్ల తరబడి కమిషన్ సిఫారసులను అమలు చేయలేదని అన్నారు.
Read Also: Raghav Chadha: వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం.. కాంగ్రెస్ విమర్శలు
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
1980లో, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘మండల్ కమిషన్’ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని, 1990లో దానిని ఆమోదించిన సమయంలో, రాజీవ్ గాంధీ రెండున్నర గంటలు ప్రసంగించి ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని అమిత్ షా గుర్తు చేశారు. కర్ణాటకలో వెనకబడిన వర్గాల రిజర్వేషన్లను లాక్కుని కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చిందని, హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందని అమిత్ షా అన్నారు.
హర్యానాలో ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతించబోమని తాను హామీ ఇస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. హర్యానాలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 15 రోజుల్లో హర్యానాలో అమిత్ షా పర్యటించడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 29న పంచకులతో జరిగిన బీజేపీ విస్తృత రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో అమిత్ షా మాట్లాడారు.
తాజావార్తలు
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!