Rahul Gandhi: బీజేపీ విధానాల వల్లే జమ్మూ కాశ్మీర్కి ఈ పరిస్థితి.. దోడా ఘటనపై రాహుల్..
- జమ్మూ కాశ్మీర్ పరిస్థితికి బీజేపీనే కారణం..
- దోడా ఎన్కౌంటర్పై రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మరణించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. వారికి నివాళులు అర్పించిన రాహుల్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ఈరోజు, జమ్మూ కాశ్మీర్లో మరో ఉగ్రవాద ఎన్కౌంటర్లో మా సైనికులు అమరులయ్యారు. అమరవీరులకు నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను మరియు మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న దాడులు విచారకరమని, ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
READ ALSO: Virat Kohli: కోహ్లీ మారిపోయాడు.. ఫోన్ నెంబర్ కూడా తెలియదు! టీమిండియా స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
జమ్మూ కాశ్మీర్లో దయనీయ పరిస్థితికి బీజేపీ తప్పుడు విధానాలే కారణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పరోక్షంగా ప్రస్తావించారు. పదేపదే భద్రతా లోపాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, దేశభక్తి కలిగిన ప్రతీ భారతీయుడి డిమాండ్ అని ఆయన అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు రాజకీయ ఐక్యతను ప్రదర్శించాలని చెప్పారు. ఈ విషాద సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఒక్కతాటిపైకి రావాలని కోరారు.
దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ, జమ్మాకాశ్మీర్ పోలీసులపై దాడికి తెగబడ్డారు. పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడారు. కొనసాగుతున్న ఆపరేషన్ని సమీక్షించారు. గత వారం కథువా ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మరణించిన తర్వాత ఇదే రెండో అతిపెద్ద ఎన్కౌంటర్. పూంచ్, రాజౌరీలలో మొదలైన ఈ దాడులు ఇప్పుడు కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్రవాదం లేని ప్రాంతం. గత 32 నెలల్లో 48 మంది సైనికులు ఉగ్రదాడుల్లో మరణించారు.
आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।
एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है।
लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…
— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!