Farmers March: ఢిల్లీ మార్చ్కి సిద్ధమవుతున్న రైతులు..
- శంభు బోర్డర్ వద్ద బారికెడ్ల తొలగింపు..
- మరోమారు ఆందోళనలకు సిద్ధమవుతున్న రైతు సంఘాలు..
- ఢిల్లీ మార్చ్కి ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers March: మరోసారి రైతులు ఆందోళలనకు సిద్ధమవుతున్నారు. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద హర్యానా ప్రభుత్వం రోడ్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి మార్చ్గా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లేదా రాంలీలా మైదాన్లో శాంతియుతంగా తమ నిరసన తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా సిద్ధూపూర్ ప్రెసిడెంట్ జగ్జీత్ సింగ్ దల్లెవాల్ తెలిపారు.
Read Also: BJP: అవార్డులు కావాలంటే సౌదీ వెళ్లండి.. మదర్సా విద్యార్థులపై బీజేపీ నేత..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతులకు ఫించన్లు వంటి డిమాండ్లతో మరోసారి ఆందోళన చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీకి మార్చ్ చేసేందుకు సిద్ధమైన తరుణంలో శంభు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి రోడ్డుని బ్లాక్ చేసి ఉంది. అయితే, ఇటీవల వీటిని తొలగించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశించింది. వీటి వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతోందని హైకోర్టు పేర్కొంది. శాంతిభద్రతల సమస్య అని పేర్కొంటూ హైకోర్టు తీర్పును హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
మరోసారి తమను అడ్డుకుని, రోడ్డును బ్లాక్ చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. మార్చిలో జరిగిన నిరసనల్లో నవదీప్ సింగ్ అనే రైతు నాయకుడు అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనికి సంఘీభావం తెలిపేందుకు రేపు, మరుసటి రోజు అంబాల వద్ద శాంతియుత నిరసన ప్లాన్ చేసినట్లు దల్లేవాల్ తెలిపారు. నవదీప్ సింగ్ హత్యాయత్నం సహా అల్లర్లను ప్రేరేపించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!