Asaduddin Owaisi: ‘‘ ఇంట్లోకి దూరి చంపుతాం’’ అని మోడీ చెప్పారు.. మరి ఇదేంటి..?
- వరస ఉగ్రదాడులపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..
- మోడీ ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన దోడా ఉగ్రఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. దీనిపై ప్రతిపక్షాలు బీజేపీపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీని టార్గెట్గా ప్రశ్నించారు. ‘‘ఘర్ మే ఘుస్ కర్ మారేంగే’’ ఉగ్రవాదుల్ని ఇంట్లోకి దూరి చంపేస్తాం అని ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగేంటని ప్రశ్నించారు.
వరసగా జరుగుతున్న ఉగ్రఘటనలు ప్రభుత్వం వైఫల్యానికి అద్దం పడుతున్నాయని కేంద్రంపై ఓవైసీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని అదుపు చేయలేకపోతున్నారు, దోడాలో జరిగిన ఘటన చాలా ప్రమాదకమైందని ఓవైసీ అన్నారు. సోమవారం సాయంత్రం దోడాలోని దేసా ఫారెస్ట్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, జవాన్లు రాజేష్, బిజేంద్ర, అజయ్లు మరణించారు.
Also Read
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
Read Also: Pakistan: పాక్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 8 మంది భద్రతా సిబ్బంది మృతి..
ఈ ఉగ్రదాడులపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ అక్కడి ప్రాంతీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ పౌరసమాజంలోకి పాకిస్తాన్ని చొప్పించాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ, డీజీపీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నియంత్రణ రేఖకు చాలా దూరంలో ఉన్న దోడా ప్రాంతంలోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారని, దీనికి బాధ్యులు ఎవరు..? అని ప్రశ్నించారు. 2021 నుండి, జమ్మూలో, 50 మందికి పైగా భద్రతా సిబ్బంది మరియు 19 మంది పౌరులు మరణించారు. ఇటీవల ఆలయానికి వెళ్లిన 10 మంది యాత్రికులు ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది, ఇప్పుడు డీజీపీ ఇలా మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా..? అని ప్రశ్నించారు.
స్థానికుల్లో మీకు ఎందుకు సాయం చేయడం లేదు..? యువతలో ఎందుకు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు..? ఆర్టికల్ 370ని తొలగించామని అంతా అయిపోయిందని అనుకుంటున్నారా.? ఇది నరేంద్రమోడీ ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు . డీజీపీ అధికార పార్టీకి ప్రతినిధిగా మారాకూడదని, ఆయన ఉద్దేశంలో బీజేపీలో చేరాలని ఘాటుగా స్పందించారు. మరోవైపు, బీజేపీ అధికారంలోకి వచ్చిన 38 రోజుల్లో 9 ఉగ్రవాద ఘటనలు జరిగాయని కాంగ్రెస్ విమర్శించింది.
తాజావార్తలు
-
lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
-
Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
-
Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
-
TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
-
Karuppu : కరుప్పు హిట్.. కీ టెక్నీషియన్స్’కి కార్లు కొనిపెట్టిన సూర్య
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!