Sanatana Dharma: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో గురువారం తిరుపతిలో జరిగిన ‘‘వారహి డిక్లరేషన్’’ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు.
India map: భారతదేశ మ్యాప్ని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తప్పుగా చూపిండటంతో విమర్శలు ఎదుర్కొంది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించారు. భారత్ ఎప్పుడూ ఇజ్రాయిల్తో నిలుస్తుంది, ఇజ్రాయిల్ భారత్తో ఉందా..? అని పలువురు ప్రశ్నించారు. పొరపాటుని గమనించిన రాయబార కార్యాలయం వెంటనే తప్పుగా చూపించిన మ్యాప్ని వెబ్సైట్ నుంచి తొలగించింది.
Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.
Chhattisgarh encounter: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ సందర్భంగా శుక్రవారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్-దంతేవాడ సరిహద్దు ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఎన్కైంటర్ ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ తెలిపారు.
Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడిని ముమ్మరం చేసింది. లెబనాన్ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని వైమానిక దాడిలో హతమార్చింది. అంతకుముందు హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్లను హతం చేసింది. వీరిలో అత్యంత కీలకమైన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారు ఉన్నారు. అయితే, నస్రల్లాకి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించే వరకు అతడిని రహస్య ప్రదేశంలో తాత్కాలికంగా ఖననం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు.
Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు.
Agra Shocker: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల నకిలీ బెదిరింపులకు, బ్లాక్మెయిల్కి భయపడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు, ఆమె కూతురు ‘‘సెక్స్ రాకెట్’’ ఇరుక్కుందని నేరగాళ్లు కాల్ చేసి బెదిరించారు.
Classical language: కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. మరో 5 భాషలకు ‘‘శాస్త్రీయ హోదా’’(క్లాసికల్ స్టేటస్)ని కల్పించారు. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ భాషలకు కొత్తగా క్లాసికల్ హోదాను కల్పించాలని గురువారం నిర్ణయించారు.
Marital Rape: వైవాహిక అత్యాచారాలను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఎందుకుంటే తగినన్ని శిక్షాణాత్మక చర్యలు రూపొందించబడ్డాయని పేర్కొంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సుప్రీంకోర్టు పరిధిలో లేదని కేంద్రం తెలిపింది. వైవాహిక అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కన్నా సామాజిక సమస్య అని,