Hassan Nasrallah: అంత్యక్రియలు జరిగే వరకు రహస్య ప్రదేశంలో నస్రల్లా తాత్కాలిక ఖననం..
- హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా అంత్యక్రియలపై రాని క్లారిటీ..
- తాత్కాలికంగా రహస్య ప్రదేశంలో ఖననం..
- పరిస్థితుల చక్కబడ్డాకే బహిరంగ అంత్యక్రియలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడిని ముమ్మరం చేసింది. లెబనాన్ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని వైమానిక దాడిలో హతమార్చింది. అంతకుముందు హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్లను హతం చేసింది. వీరిలో అత్యంత కీలకమైన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారు ఉన్నారు. అయితే, నస్రల్లాకి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించే వరకు అతడిని రహస్య ప్రదేశంలో తాత్కాలికంగా ఖననం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? వంటింట్లో దొరికే ఇది వాడండి
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బహిరంగంగా అంత్యక్రియలకు అనకూలంగా మారే వరకు నస్రల్లాను తాత్కాలికంగా ఖననం చేసినట్లు తెలుస్తోంది. నస్రల్లా మరణించి వారం దాటినా, ఇంకా అంత్యక్రియాలకు సంబంధించి ప్రణాళికల్ని హిజ్బుల్లా ప్రకటించలేదు. అతడి చివరి ఖనన ప్రదేశం లెబనాన్ లేదా ఇరాక్లో ఉండొచ్చని తెలుస్తోంది. ఇరాక్ ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్ సుడానీ సలహాదారు అబ్దుల్ అమీర్ అల్ టెయిబాన్ ఇటీవల.. షియా ముస్లిం సమాజానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఇరాక్లోని ‘‘ఇమామ్ హుస్సేన్ పక్కన, కర్బాలాలో’’ నస్రల్లాని ఖననం చేస్తారని ట్వీట్ చేశారు.
అయితే, నస్రల్లా అంత్యక్రియలు నిర్వహించడానికి లెబనీస్ మధ్యవర్తులు అమెరికా నాయకుల నుంచి హామీని కోరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కొనసాగుతన్న ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అలాంటి హామీలు ఏమీ పొందలేదని లెబనీస్ అధికారి వెల్లడించారు. మూడు దశాబ్ధాలకు పైగా హిజ్బుల్లాకు చీఫ్గా ఉన్న నస్రల్లాని బీరూట్ దక్షిణ ప్రాంతంలోని బంకర్లో ఉండగా, ఇజ్రాయిల్ బంకర్ బస్టర్ బాంబుల్ని వాడి చంపేసింది. పేలుడు కారణంగా విషపూరితమైన పొగ నస్రల్లా ఊపిరి పీల్చుకోకుండా చేసిందని, దీంతోనే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!