Iran: ‘‘ఇజ్రాయిల్ ఎప్పటికీ గెలవలేదు’’.. సుప్రీంలీడర్ ఖమేనీ మెగా స్పీచ్..
- ఇజ్రాయిల్ ఎప్పటికీ గెలవలేదు..
- హిజ్బుల్లా.. పాలస్తీనియన్లు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది..
- నస్రల్లా మరణం వృథా కాదు..
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు. ‘‘మేము మా శత్రువులను ఓడిస్తాము’’ అని ఖమేనీ ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం తన ఉపన్యాసంలో ఇజ్రాయిల్కి వ్యతిరేఖంగా పాలస్తీనియన్లకు, లెబనీస్ ప్రజలకు మద్దతు తెలిపారు. తమ శత్రువులను ఓడించాలని ప్రతిజ్ఞ చేశారు. టెహ్రాన్లోని ఒక మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఖమేనీ మాట్లాడారు. ఇటీవల ఇజ్రాయిల్పై జరిగిన క్షిపణి దాడుల్ని ‘‘ప్రజాసేవ’’గా అభివర్ణించారు. హమాస్ లేదా హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఎన్నటికీ విజయం సాధించలేదని, ఇరాన్ మీతో ఉందని అతను ప్రకటించాడు.
Read Also: Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇటీవల హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత ఖమేనీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతడి ప్రాణాలకు ఇజ్రాయిల్ నుంచి ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో ఈ వార్తలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, గత ఐదేళ్లలో తొలిసారిగా ఖమేనీ శుక్రవారం రోజు ఉపన్యసించారు. మంగళవారం ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చింది.
ఖమేనీ తన ప్రసంగంలో హసన్ నస్రల్లాని కొనియాడారు. నస్రల్లా మనతో లేకున్నా, అతడి ఆత్మ, అతడి మార్గం మనకు ఎప్పటికీ స్పూర్తినిస్తుందని చెప్పాడు. అతడి బలిదానం మరింత ప్రభావాన్ని పెంచుతుందని అన్నాడు. నస్రల్లా మరణం వృథా కాదని, మన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటుందని, శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. లెబనాన్ రక్తపాతంలో ఉన్న ప్రజలకు సాయం చేయడానికి జిహాద్, అల్ అక్సా మసీదు కోసం యుద్ధానికి మద్దతు ఇవ్వడం ముస్లింలందరి విధి, బాధ్యత అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్పై అక్టోబర్ 07 నాటి దాడిని సరైన చర్యగా అభివర్ణించాడు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!