Bhatti Vikramarka: వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే
- కొమురం భీం జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటన
- మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు
- ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని భట్టి తెలిపారు. నీటి పారుదల సమస్యలు అడిగారు. అప్పుడు బ్రిడ్జి అడిగారు. వాటి పనులు పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు. ఓజా కళాకారుల కళ ఎంతో గొప్పది అని కొనియాడారు.
Also Read:ENE 2: అందుకే తప్పుకున్న.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై సుశాంత్ షాకింగ్ పోస్ట్..
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
కళాకారులను ఆదుకుంటాం అని అండగా ఉంటామని చెప్పాను. అందులో భాగంగా మీ ఓజా కళను కాడుకోవడం కోసం రుణాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహాలక్ష్మి ల్లాగా ఉన్నారు.. మహిళలకు ఇప్పటికే రూ.26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. మహిళల్ని కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మేము డబ్బులు కడుతున్నామని తెలిపారు. నాడు వెయ్యి రూపాయలు లేని పరిస్థితిలో ఉన్న మహిళను నేడు బస్సులకు ఓనర్లను చేశాం.. చెప్పినట్టుగానే ధరణి తీసి భూ భారతి తెచ్చామని భట్టి తెలిపారు.
Also Read:YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!
కొమరం భీం ప్రాజెక్ట్ కెనాల్ కాలేదు అన్నారు.. వారికి ప్రపోజల్స్ పంపారు.. పనులు త్వరలో ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. దొడ్డు బియ్యం స్థానం లో సన్న బియ్యం ఇస్తున్నాం.. 96 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట, ప్రజా బాట పట్టారు. మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారిని కలవండని గ్రామస్తులకు సూచించారు. 108 తరహాలో విద్యుత్ సమస్యల పైన 1912 ను సంప్రదించండి విద్యుత్ సమస్యలను పరిష్కారం చేస్తారని అన్నారు. మీ ప్రాంత సమస్య లను పరిష్కారం కోసం ఓ అంబులెన్స్ వస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!