Revenge: 22 ఏళ్ల పగ.. తండ్రిని ఎలా చంపాడో, అలాగే వ్యక్తిని చంపేసిన కొడుకు..
- 22 ఏళ్ల నాటి పగ.. వ్యక్తి దారుణ హత్య..
- తండ్రిని హత్య చేసిన వ్యక్తిని చంపిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revenge: 22 ఏళ్ల పగ, సరైన సమయం కోసం వేచి చూశాడు. తన తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చివరకు తన తండ్రిని ఏ విధంగా చంపాడో, అదే విధంగా సదరు వ్యక్తిని కొడుకు చంపేశాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. 30 ఏళ్ల యువకుడు, తన తండ్రిని చంపిన వ్యక్తిని ట్రక్కుతో తొక్కించి చంపేశాడు. తన పగ తీర్చుకునేందుకు 22 ఏళ్ల పాటు వేచి చూశాడు.
నఖత్ సింగ్ భాటి(50) మంగళవారం సైకిల్పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన గోపాల్ని పోలీసులు పట్టుకున్నారు. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, గోపాల్ ఉద్దేశపూర్వకంగానే నఖత్ సింగ్ని ఢీకొట్టి, ట్రక్కు అతడిపైకి ఎక్కించినట్లు తేలింది.
Also Read
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
Read Also: KVP Ramachandra Rao: నా ఫాంహౌస్ అక్రమమైతే నేనే కూలుస్తా..
విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన పగ-ప్రతీకారం గురించి గోపాల్ పోలీసులకు చెప్పాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే పక్కా ప్లాన్తో హత్య చేశాడని తేలింది. 2002లో రాజస్థాన్ జైసల్మీర్లో గోపాల్ తండ్రి హరిసింగ్ భాటిని ట్రక్కుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ కేసులో నఖత్ సింగ్తో పాటు అతడి నలుగురు సోదరుల ప్రమేయం ఉంది. వీరికి ఏడేళ్ల శిక్ష విధించబడింది. అప్పటి నుంచి తండ్రిని హత్య చేసిన నఖత్ సింగ్పై గోపాల్ పగ పెంచుకున్నారు. ఎలాగైనా చంపాలని భావించాడు.
ఈ హత్య కోసమే గోపాల్ గత వారం రూ.8 లక్షలతో పికప్ ట్రక్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు కోసం రూ. 1.25 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాడు. నఖత్ని చంపేందుకు అతడి ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించాడు. పోలీసులు గోపాల్ మొబైల్ వివరాలు పరిశీలించడంతో ఈ విషయం తేలింది. నఖత్, గోపాల్ కుటుంబాల మధ్య కొంతకాలంగా శత్రుల్వ ఉందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..