Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..
- హిమాచల్లో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ రగడ..
- కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను విధిస్తున్నట్లు వార్తలు..
- అలాంటిదేం లేదని సీఎం సుఖూ క్లారిటీ..
- కాంగ్రెస్పై విరుచుకుపడుతున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు. హిమాచల్ ప్రభుత్వం పట్టణ నివాసితులపై ప్రతీ టాయ్లెట్ సీటుకి రూ. 25 పన్ను విధిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నివేదికలన్నీ కూడా నిరాధారమైనవిగా సుఖూ పేర్కొన్నారు. రూ. 100 వాటర్ ఛార్జీలో ‘ టాయిలెట్ పన్ను’ ప్రతీ నివాసానికి 25 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
Read Also: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
పట్టణ భవనంలో టాయిలెట్ సీట్ల సంఖ్య ఆధారంగా ఛార్జీలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ, అలాంటి అదనపు సెస్ విధించలేదని చెప్పారు. టాయిలెట్ ట్యాక్స్ గురించి మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా రాజకీయ గందరగోళం నెలకొంది. “ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 21న జారీ చేయబడింది. మురుగునీటి పారుదల ఛార్జీలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ అదే రోజు ఉపసంహరించబడింది. దీనిపై డిప్యూటీ సీఎం తరఫున అభ్యంతరం వ్యక్తం చేశారు. సిమ్లాలో ఇప్పటికే మురుగునీటి ఛార్జీలు వసూలు చేయబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇది హోటళ్లు మరియు కొన్ని సంస్థలకు వర్తిస్తుంది. త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు’’ అని హిమాచల్ ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఓంకార్ శర్మ తెలిపారు.
అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. ఈ పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు వివిధ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నమ్మలేనిది, ఇదే నిజమైతే! పీఎం (నరేంద్ర) మోడీ జీ స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా నిర్మిస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ ప్రజలు మరుగుదొడ్ల కోసం పన్నులు వేస్తున్నారు! వారి కాలంలో వారు మంచి పారిశుధ్యం అందించనందుకు సిగ్గుపడాలి, కానీ ఈ చర్య దేశం సిగ్గుపడుతుంది.’’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై నిరంతరం కొత్త పన్నులు, ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఇది హిమాచల్ ప్రభుత్వ ఆర్థిక దివాలా, విధానపరమైన దివాలా, మానసిక దివాలాను ప్రతిబింబిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!