Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..
- హిమాచల్లో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ రగడ..
- కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను విధిస్తున్నట్లు వార్తలు..
- అలాంటిదేం లేదని సీఎం సుఖూ క్లారిటీ..
- కాంగ్రెస్పై విరుచుకుపడుతున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు. హిమాచల్ ప్రభుత్వం పట్టణ నివాసితులపై ప్రతీ టాయ్లెట్ సీటుకి రూ. 25 పన్ను విధిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నివేదికలన్నీ కూడా నిరాధారమైనవిగా సుఖూ పేర్కొన్నారు. రూ. 100 వాటర్ ఛార్జీలో ‘ టాయిలెట్ పన్ను’ ప్రతీ నివాసానికి 25 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
Read Also: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
పట్టణ భవనంలో టాయిలెట్ సీట్ల సంఖ్య ఆధారంగా ఛార్జీలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ, అలాంటి అదనపు సెస్ విధించలేదని చెప్పారు. టాయిలెట్ ట్యాక్స్ గురించి మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా రాజకీయ గందరగోళం నెలకొంది. “ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 21న జారీ చేయబడింది. మురుగునీటి పారుదల ఛార్జీలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ అదే రోజు ఉపసంహరించబడింది. దీనిపై డిప్యూటీ సీఎం తరఫున అభ్యంతరం వ్యక్తం చేశారు. సిమ్లాలో ఇప్పటికే మురుగునీటి ఛార్జీలు వసూలు చేయబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇది హోటళ్లు మరియు కొన్ని సంస్థలకు వర్తిస్తుంది. త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు’’ అని హిమాచల్ ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఓంకార్ శర్మ తెలిపారు.
అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. ఈ పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు వివిధ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నమ్మలేనిది, ఇదే నిజమైతే! పీఎం (నరేంద్ర) మోడీ జీ స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా నిర్మిస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ ప్రజలు మరుగుదొడ్ల కోసం పన్నులు వేస్తున్నారు! వారి కాలంలో వారు మంచి పారిశుధ్యం అందించనందుకు సిగ్గుపడాలి, కానీ ఈ చర్య దేశం సిగ్గుపడుతుంది.’’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై నిరంతరం కొత్త పన్నులు, ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఇది హిమాచల్ ప్రభుత్వ ఆర్థిక దివాలా, విధానపరమైన దివాలా, మానసిక దివాలాను ప్రతిబింబిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!