BMC Elections: ముంబై మేయర్ పీఠం మహిళదే.. లాటరీ డ్రాలో తేలిన ఫలితం..
- జనరల్ మహిళకు రిజర్వ్ అయిన ముంబై మేయర్ పదవి..
- కీలక లాటరీ డ్రాలో తేలిన ఫలితం..
- ప్రక్రియపై ఉద్ధవ్ సేన అభ్యంతరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Elections: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు పూర్తయినా రాజకీయ వివాదాలు ఇంకా ముగియడం లేదు. తాజాగా గురువారం రోజున ప్రతిష్టాత్మక మేయర్ స్థానం గురించి లాటరీ డ్రా జరిగింది. ఈ లాటరీలో ముంబై మేయర్ పీఠం ‘‘మహిళ’’కే దక్కింది. ‘‘జనరల్ మహిళ’’కు ముంబై మేయర్ రిజర్వ్ చేయబడింది. అయితే, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటి మాత్రం ఈ ప్రక్రియ, ఫలితాలపై తీవ్ర అభ్యంతరం తెలియజేయడంతో గందరగోళం నెలకొంది.
ముంబై మేయర్ పదవి రిజర్వేషన్ పై ఉద్ధవ్ సేన నాయకురాలు, మాజీ ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ బీఎంసీ మేయర్ పీఠాన్ని ఎందుకు ఓబీసీ కేటగిరిలో చేర్చలేదని ప్రశ్నించారు. గత రెండు పర్యాయాలుగా ఈ పదవికి రిజర్వేషన్ లేకుండానే ఉందని ఆమె అన్నారు. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నామని పరిశీలిస్తామని రాష్ట్రమంత్రి తెలిపారు. అధికార కూటమికి లబ్ధి చేకూరేలా ఫిక్సింగ్ జరిగినట్లు ఉద్ధవ్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్ల నిబంధనల్ని మార్చిందని, ఆ కేటగిరి నుంచి కనీస సంఖ్యలో సభ్యులు ఉండాలనే నిబంధనల్ని చివరి నిమిషంలో మార్చారని కిషోరి అన్నారు. ఈ కేటగిరీ నుంచి ఉద్ధవ్ పార్టీకి మాత్రమే ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నందున, ముంబైని ఉద్దేశపూర్వకంగా ఎస్టీ కేటగిరీలో చేర్చలేని అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Honour KIilling: యూపీలో పరువు హత్య.. సోదరి, ఆమె ముస్లిం ప్రియుడి హత్య..
ఇటీవల జరిగిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కైవసం చేసుకుంది. గత రెండు దశాబ్ధాలుగా ఠాక్రేల ఆధిపత్యం ముగిసింది. బీజేపీ-షిండే సేన కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. 227 స్థానాలు ఉన్న ముంబైలో బీజేపీ 89, షిండే శివసేన 29 స్థానాలు సాధించాయి. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు. కాగా బీజేపీ+షిండే సేన మ్యాజిక్ ఫిగర్ దాటి స్థానాలు గెలుచుకున్నాయి.
రిజర్వేషన్ ప్రకారం, పూణే, ధూలే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), నాందేడ్, నవీ ముంబై, మాలేగావ్, మీరా భయాందర్, నాసిక్ మరియు నాగ్పూర్లలో మేయర్ పదవులు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. మరోవైపు, లాతూర్, జల్నా, థానే మూడు మునిసిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (SC) రిజర్వ్ చేయబడ్డాయి, వీటిలో లాతూర్, జల్నా SC మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి.
మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీకి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో, అకోలా, చంద్రపూర్, అహల్యానగర్, జల్గావ్ OBC మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే, పన్వెల్, ఇచల్కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్నగర్ OBC అభ్యర్థులకు కేటాయించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!