Venu Goapl Reddy
Author- NTV Telugu-
Honeytrap: యూపీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివరాలు లీక్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్..
Honeytrap: ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఫ్యాక్టరీకి చెందిన సున్నిత వివరాలను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘హానీ ట్రాప్’’లో చిక్కుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆగ్రాకు చెందిన రవీంద్ర కుమార్తో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేసింది. -
Kim Kardashian: “అంబానీలు” ఎవరో తెలియకున్నా పెళ్లికి వచ్చాం.. కిమ్ కర్దాషియాన్ కామెంట్స్..
Kim Kardashian: గతేడాది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ అట్టహాసంగా జరిగింది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. అనంత్, రాధికల వివాహానికి హాజరయ్యేందుకు కిమ్ కర్దాషియాన్, ఖ్లో కర్దాషియాన్ హాజరయ్యారు. భారతీయ సంప్రదాయ వస్త్రాలలో వీరిద్దరు మెరిసిపోయారు. -
Taliban: రైలు హైజాక్తో మాకు సంబంధం లేదు.. పాక్ ఆరోపణలపై తాలిబన్లు..
Taliban: బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. -
DMK: ఉత్తరాది మహిళలు 10 మందిని పెళ్లి చేసుకుంటారు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
DMK: తమిళనాడు, కేంద్రానికి మధ్య ఇప్పటికే ‘‘హిందీ’’, ‘‘డీ లిమిటేషన్’’ వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఉత్తర, దక్షిణ భారతదేశాలు అంటూ డీఎంకే నేతలు కొత్త వివాదాలను తీసుకువస్తున్నారు. తాజాగా, తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశంలోని మహిళలు అనేక మంది భర్తల్ని కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని అన్నారు. తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని హెచ్చరించారు. Read Also: Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ […] -
Fish bite: చేప కాటు వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్.. చేయిని కోల్పోయిన రైతు..
Fish bite: చేప కాటు ఏకంగా ఓ వ్యక్తి చేయినే లేకుండా చేసింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో 38 ఏళ్ల రైతు చేపకాటుకు గురైన తర్వాత ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకింది. చేప కాటుకు గురైన చేయిని మణికట్టు వరకు తొలగించాల్సి వచ్చింది. తలస్సేరిలోని మడపీడిక నివాసి అయిన రజీష్, ఫిబ్రవరి ప్రారంభంలో ఒక గుంటను శుభ్రం చేస్తున్నప్పుడు, స్థానికంగా కడు అని పిలిచే చేప కరిచినట్లు చెప్పాడు. అయితే, మొదట్లో గాయం చిన్నదిగా కనిపించిందని, ఆ […] -
Mizoram local body polls: మరోసారి కాంగ్రెస్కి ‘‘సున్నా’’.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..
Mizoram local body polls: దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి వరసగా ఓటములు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే హర్యానా మేయర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. చివరకు కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ హుడా ఇలాకాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం 10 మేయర్ స్థానాల్లో 09ని గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. పదోస్థానంలో బీజేపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. -
Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ సురక్షితంగా లేదు’’.. G7కి కెనడా వార్నింగ్..
Canada: G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాను ఉద్దేశిస్తూ జీ7 దేశాలకు హెచ్చరికల చేశారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యూరప్, బ్రిటన్ వంటి మిత్రదేశాలను హెచ్చరిస్తూ.. ‘‘అమెరికాకు అత్యంత సన్నిహితుడైన కెనడాకు ఇలా చేయగలిగితే, ఎవరూ సురక్షితంగా లేరు’’ అని ఆమె అన్నారు. Read Also: Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్లో హోలీ వేడుకలు.. […] -
Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్లో హోలీ వేడుకలు.. భారీగా భద్రత..
Sambhal holi celebration: హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు. -
Pakistan Train Hijack: ట్రైన్ హైజాక్ వెనక భారత్ హస్తం.. పాక్ సంచలన ఆరోపణ..
Pakistan Train Hijack: పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్లో ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ హైజాక్కి గురైంది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలుని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఫైటర్స్ హైజాక్ చేశారు. అయితే, ఈ ఘటన వెనక భారతదేశ హస్తముందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం ఆరోపించింది. ఈ హైజాక్లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు బలూచ్ ఫైటర్స్ చేతిలో మరణించారు. -
Sunita Williams: స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ రెస్క్యూ మరోసారి వాయిదా.. కారణం ఏంటి..?
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమికి తీసుకువచ్చే రెస్క్యూ మిషన్ మరోసారి వాయిదా పడింది. గతేడాది జూన్ 5న ఫ్లోరిడా నుంచి బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఆమె ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’ వెళ్లారు. అయితే, స్టార్లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్లో సమస్యలు ఏర్పడటం, థ్రస్టర్లు విఫలమవ్వడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. సునీతా విలియమ్స్తో పాటు బుల్ విల్మోర్ కూడా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?