Sanatana Dharma: పవన్ కళ్యాణ్ VS ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై రగడ..
- సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..
- స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్..
- పవన్ టార్గెట్గా డీఎంకే నేతల విమర్శలు..
Sanatana Dharma: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో గురువారం తిరుపతిలో జరిగిన ‘‘వారహి డిక్లరేషన్’’ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. గతేడాది సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ, దానిని తుడిచేయాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు ధ్వజమెత్తారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందిస్తూ ఉదయనిధిపై విమర్శలు చేశారు.
Read Also: Jaishankar Pakistan Tour: పదేళ్ల తర్వాత పాకిస్థాన్కు భారత్ విదేశాంగ మంత్రి.. ఎందుకంటే?
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వారే తుడిచిపెట్టుకుపోతారని అన్నారు. ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని అనకండి.. అది నాశనం అవుతుందనే మాటలు చెప్పకండి సార్.. మీరు సనాతన ధర్మాన్ని తుడిచేయలేరు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నుంచి తుడిచిపెట్టుకుపోతారు’’ అని తిరుపతి సభలో పవన్ అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సనాతన పరిరక్షణ బోర్డుల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఇందుకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని కోరారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఎవరి పేరు చెప్పనప్పటికీ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. పవన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే తుడిచిపెట్టుకుపోతారనే వ్యాక్యలపై స్పందిస్తూ.. వేచి చూద్ధాం(లెట్స్ వెయిట్ అంటూ సీ) అని ఉదయనిధి రిప్లై ఇచ్చారు. డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పవన్ కళ్యాణ్, బీజేపీని విమర్శించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!