Sanatana Dharma: పవన్ కళ్యాణ్ VS ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై రగడ..
- సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..
- స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్..
- పవన్ టార్గెట్గా డీఎంకే నేతల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatana Dharma: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో గురువారం తిరుపతిలో జరిగిన ‘‘వారహి డిక్లరేషన్’’ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. గతేడాది సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ, దానిని తుడిచేయాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు ధ్వజమెత్తారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందిస్తూ ఉదయనిధిపై విమర్శలు చేశారు.
Read Also: Jaishankar Pakistan Tour: పదేళ్ల తర్వాత పాకిస్థాన్కు భారత్ విదేశాంగ మంత్రి.. ఎందుకంటే?
Also Read
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వారే తుడిచిపెట్టుకుపోతారని అన్నారు. ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని అనకండి.. అది నాశనం అవుతుందనే మాటలు చెప్పకండి సార్.. మీరు సనాతన ధర్మాన్ని తుడిచేయలేరు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే, వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నుంచి తుడిచిపెట్టుకుపోతారు’’ అని తిరుపతి సభలో పవన్ అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సనాతన పరిరక్షణ బోర్డుల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఇందుకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని కోరారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఎవరి పేరు చెప్పనప్పటికీ తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. పవన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే తుడిచిపెట్టుకుపోతారనే వ్యాక్యలపై స్పందిస్తూ.. వేచి చూద్ధాం(లెట్స్ వెయిట్ అంటూ సీ) అని ఉదయనిధి రిప్లై ఇచ్చారు. డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పవన్ కళ్యాణ్, బీజేపీని విమర్శించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
-
Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
-
Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
-
Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?