Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది యోగి సర్కార్. మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కాబోతోంది. అయితే, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. -
Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..
Bombay High Court: ఒక బాలికను ఫాలో అయ్యాడనే ఒకే ఉదాహరణ అనేది ఐపీసీ సెక్షన్ 354(D) ప్రకారం ఒక బాలికను స్టాకింగ్(వెంబడించడం) చేశాడనే నేరంగా పరిగణించబడటానికి అనుగుణంగా లేదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులో లైంగిక వేధింపులు, అతిక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు 19 ఏళ్ల యువకులకు సంబంధించిన పిటిషన్ల జస్టిస్ జీఏ సనప్ విచారించారు. -
Israel: మొస్సాద్ గూఢచారిని బహిరంగంగా ఉరితీసిన సిరియా.. మృతదేహం కోసం ఇజ్రాయిల్ చర్చలు..!
Israel: మొస్సాద్ - ఇజ్రాయిల్ గూఢచార సంస్థ. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పై ఏజెన్సీ. 1962లో సిరియాలో మొస్సాద్ ఏజెంట్ ఎలి కోహెన్ బహిరంగంగా ఉరితీయబడ్డాడు. వ్యాపారవేత్తగా కమెల్ అమిన్ థాబెట్ పేరుతో సిరియా రాజధాని డమాస్కస్లోకి అడుగుపెట్టి కోహెన్, అతి తక్కువ కాలంలోనే ఆ దేశంలోని ఎలైట్ వర్గంలో ప్రముఖ వ్యక్తిగా మారాడు. దేశంలోని శక్తివంతమైన రాజకీయ నాయకులు, మిలిటరీ లీడర్లతో సంబంధాలను పెంచుకున్నాడు. -
Zimbabwe: సింహాలతో నిండి ఉన్న అడవిలో తప్పిపోయిన 8 ఏళ్ల బాలుడు.. ఎలా బయటపడ్డాడంటే..
Zimbabwe: ఆఫ్రికా దేశం జింబాబ్వే కఠినమైన అడవులు, వన్యప్రాణులకు కేంద్రంగా ఉంది. ఇలాంటి అడవుల్లో ఎవరైనా తప్పిపోతే దాదాపుగా మరణమే శరణ్యం. అలాంటిది ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతంగా బయటపడిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తగా నిలిచింది. ఉత్తర జింబాబ్వేకి చెందిన బాలుడు కఠినమైన అడవి పరిస్థితులను ధిక్కరించి విజయం బయటపడపడ్డాడు. -
Gujarat: ‘‘ఆమెకు గుణపాఠం చెప్పండి’’..భార్య వేధింపులతో మరో వ్యక్తి బలి..
Gujarat: భార్యల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్, ఢిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా ఘటనలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్యలు వేధించడంతో తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీరిద్దరు వీడియో రికార్డ్ చేసి మరణించారు. తాజాగా గుజరాత్లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. […] -
Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Bird flu: మహారాష్ట్ర నాగ్పూర్ సమీపంలోని గోరెవాడ రెస్క్యూ సెంటర్లో మూడు పులులు, ఒక చిరుతపులి మరణించింది. బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ H5N1 వైరస్) సోకడంతో వన్యప్రాణులు మరణించాయి. డిసెంబర్ 2024 చివరలో ఈ మరణాలు నివేదించబడ్డాయి. దీంతో మహారాష్ట్ర అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మానవులు-వన్యప్రాణుల సంఘర్షణ సంఘటనల తర్వాత వీటిని డిసెంబర్లో చంద్రపూర్ నుంచి గోరెవాడకు తరలించారు. -
Ramesh Bidhuri: “నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు”.. బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు..
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది. -
George Soros: జార్జ్ సోరోస్కి యూఎస్ అత్యున్నత పురస్కారం.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..
George Soros: బిలియనీర్ జార్జ్ సోరోస్ని ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’తో గౌరవించాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్ బహిరంగంగా విమర్శించారు. ‘‘బైడెన్ సోరోస్కి ప్రెసిడెన్షియల్ మెడల్ని ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఒక విడ్డూరం’’ అని మస్క్ విమర్శించారు. -
CBI: కేరళలో మహిళ, ఇద్దరు పిల్లల హత్య.. 19 ఏళ్ల తర్వాత నిందితుల అరెస్ట్.. ఎలా చిక్కారంటే..?
CBI: మహిళ, ఆమె ఇద్దరు కవల పిల్లలను హత్య చేసిన నేరంలో నేరస్తులు 19 ఏళ్ల తర్వాత దొరికారు. వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది. పుదుచ్చేరిలో అరెస్ట్ చేసి జ్యుడిషియన్ కస్టడీకి తీసుకున్నారు. 2006లో కేరళలో ఒక మహిళ, ఆమె నవజాత కవల కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. నిందితులు 19 ఏళ్లుగా పరారీలో ఉన్నారు. -
Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ సుభాష్ సూసైడ్ కేసు.. భార్య నిఖితా సింఘానియాకు బెయిల్..
Atul Subhash Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుభాష్ ఆత్మహత్యకు కారణమైన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం బెంగళూర్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తమ బెయిల్ పిటిషన్ని పరిష్కరించేలా సెషన్ కోర్టుని ఆశ్రయించాలని వీరు గతంలో కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో