Indian Air Force: “చైనా స్పై బెలూన్” లాంటి లక్ష్యాన్ని కూల్చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్..
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ఆపరేషన్..
- చైనా స్పై బెలూన్ తరహా లక్ష్యం కూల్చివేత..
- 15 కి.మీ ఎత్తున టార్గెట్ని నాశనం చేసిన రాఫెల్ జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలకమైన విన్యాసాన్ని నిర్వహించింది. 15 కిలోమీటర్ల ఎత్తుకు పైన ప్రయాణిస్తున్న చైనా గూఢచారి బెలూన్ లాంటి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఈ ఎక్సర్సైజ్ని కొన్ని నెలల క్రితం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో రాఫెల్ ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి. ఇది పూర్తిగా కంట్రోల్డ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో అత్యంత ఎత్తైన టార్గెట్లను ఛేదించే సామర్థ్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షించుకుంది.
2023 ప్రారంభంలో చైనాకు చెందిన ఒక గూఢచర్య బెలూన్ యూఎస్ఏ మీదుగా ప్రయాణించింది. అయితే, ఆ సమయంలో అమెరికా కూల్చేసిన బెలూన్తో పోలిస్తే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిన టార్గెట్ చాలా చిన్నది. ఈ బెలూన్కి బరువును జోడించి విడుదల చేశారు. ఇది 55,000 అడుగుల ఎత్తుకి చేరగానే, క్షిపణిని ప్రయోగించి కూల్చేసినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. 15 కి.మీ ఎత్తుకు చేరుకోగానే బెలూన్ని న్యూట్రలైజ్ చేశారు. ఇది వాయుమార్గాన వచ్చే బెదిరింపుల్ని అడ్డుకునేందుకు వైమానిక దళం ఈ ఆపరేషన్ నిర్వహించింది
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
Read Also: IND vs BAN: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
ఇలా చాలా ఎత్తులో చైనాకు చెందిన నిఘా బెలూన్లు ప్రయాణిస్తూ.. వివిధ దేశాలపై నిఘా కార్యక్రమాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. 2023 ప్రారంభంలో యూఎస్ మీదుగా చైనా స్పై బెలూన్ ప్రయాణించింది. చాలా రోజుల పాటు ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఇది నిఘా కార్యకలాపాలను నిర్వహించింది. దీనిని ఎఫ్-22 ఫైటర్ జెట్ల ద్వారా దక్షిణ కెరోలిన తీరంలో కూల్చేశారు.
గతంలో భారతదేశంలో కూడా ఈ తరహా బెలూన్లు కనిపించినట్లు , అండమాన్ నికోబార్ దీవులపై ఇలాంటి బెలూన్లు సంచరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ.. మూడు నాలుగు రోజుల తర్వాత బెలూన్ భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లిపోయింది. నిపుణుల ప్రకారం.. ఈ బెలూన్లకు కొన్ని రకాల స్టీరింగ్ మెకానిజం అమర్చబడి ఉందని, అవి ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో సంచరించడానికి వీలు కల్పిస్తాయని చెప్పారు.
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!