Indian Air Force: “చైనా స్పై బెలూన్” లాంటి లక్ష్యాన్ని కూల్చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్..
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ఆపరేషన్..
- చైనా స్పై బెలూన్ తరహా లక్ష్యం కూల్చివేత..
- 15 కి.మీ ఎత్తున టార్గెట్ని నాశనం చేసిన రాఫెల్ జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలకమైన విన్యాసాన్ని నిర్వహించింది. 15 కిలోమీటర్ల ఎత్తుకు పైన ప్రయాణిస్తున్న చైనా గూఢచారి బెలూన్ లాంటి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఈ ఎక్సర్సైజ్ని కొన్ని నెలల క్రితం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో రాఫెల్ ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి. ఇది పూర్తిగా కంట్రోల్డ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో అత్యంత ఎత్తైన టార్గెట్లను ఛేదించే సామర్థ్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షించుకుంది.
2023 ప్రారంభంలో చైనాకు చెందిన ఒక గూఢచర్య బెలూన్ యూఎస్ఏ మీదుగా ప్రయాణించింది. అయితే, ఆ సమయంలో అమెరికా కూల్చేసిన బెలూన్తో పోలిస్తే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిన టార్గెట్ చాలా చిన్నది. ఈ బెలూన్కి బరువును జోడించి విడుదల చేశారు. ఇది 55,000 అడుగుల ఎత్తుకి చేరగానే, క్షిపణిని ప్రయోగించి కూల్చేసినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. 15 కి.మీ ఎత్తుకు చేరుకోగానే బెలూన్ని న్యూట్రలైజ్ చేశారు. ఇది వాయుమార్గాన వచ్చే బెదిరింపుల్ని అడ్డుకునేందుకు వైమానిక దళం ఈ ఆపరేషన్ నిర్వహించింది
Also Read
- Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
- Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
Read Also: IND vs BAN: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
ఇలా చాలా ఎత్తులో చైనాకు చెందిన నిఘా బెలూన్లు ప్రయాణిస్తూ.. వివిధ దేశాలపై నిఘా కార్యక్రమాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. 2023 ప్రారంభంలో యూఎస్ మీదుగా చైనా స్పై బెలూన్ ప్రయాణించింది. చాలా రోజుల పాటు ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఇది నిఘా కార్యకలాపాలను నిర్వహించింది. దీనిని ఎఫ్-22 ఫైటర్ జెట్ల ద్వారా దక్షిణ కెరోలిన తీరంలో కూల్చేశారు.
గతంలో భారతదేశంలో కూడా ఈ తరహా బెలూన్లు కనిపించినట్లు , అండమాన్ నికోబార్ దీవులపై ఇలాంటి బెలూన్లు సంచరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ.. మూడు నాలుగు రోజుల తర్వాత బెలూన్ భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లిపోయింది. నిపుణుల ప్రకారం.. ఈ బెలూన్లకు కొన్ని రకాల స్టీరింగ్ మెకానిజం అమర్చబడి ఉందని, అవి ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో సంచరించడానికి వీలు కల్పిస్తాయని చెప్పారు.
తాజావార్తలు
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్తో 100 కోట్ల క్లబ్లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
-
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!