Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Why Maldives Went From Hating India To Accepting Its Help In Just A Year

Maldives: భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు అర్థమైంది.. ఏడాదిలోనే ఎంత మార్పు..?

Published Date :October 7, 2024 , 6:32 pm
By BV Reddy
  • భారత్ రక్షించాలని ప్రాధేయపడుతున్న మాల్దీవులు..
  • ఇండియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్ధమైనట్లుంది..
  • ఒక్క ఏడాదిలోనే ఎంత మార్పు..
Maldives: భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులకు అర్థమైంది.. ఏడాదిలోనే ఎంత మార్పు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maldives: ‘‘ ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇప్పుడు భారతదేశ శరణు కోరేందుకు వచ్చాడు. ఏడాది క్రితం చైనాను చూసుకుని రెచ్చిపోయిన ముయిజ్జూకి, అక్కడి ప్రభుత్వానికి అసలు సమస్య వచ్చే సమయానికి ఇండియా గుర్తుకు వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయి, దివాళాకు దగ్గరగా ఉన్న తమను రక్షించాలని భారత్‌ని కోరారు. ఒక్క ఏడాదిలోనే ఎంత మార్పు.. భారత్‌ని ద్వేషించే స్థాయి నుంచి.. ఓ విధంగా చెప్పాలంటే అడుక్కునే స్థాయికి దిగజారారు. ముయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాల నుంచి మళ్లీ భారత్‌ని ప్రశంసించే స్థాయికి వచ్చింది.

2023 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో మాల్దీవుల్లో ఇండియా వ్యతిరేక సెంటిమెంట్‌ని తీసుకువచ్చి ముయిజ్జూ గెలిచాడు. భారత్ విరాళంగా ఇచ్చిన నిఘా హెలికాప్టర్లతో సహా, ఈ హెలికాప్టర్లను నిర్వహిస్తున్న 80 మంది భారతీయ సిబ్బంది ఆ దేశాన్ని వదలి వెళ్లేదాకా పట్టుబట్టాడు. అధికారంలోకి రాగానే చైనా పర్యటన పెట్టుకుని, ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు. నిజానికి ఏ మాల్దీవుల అధ్యక్షుడైనా, గెలిచిన తర్వాత తన తొలి పర్యటనను ఇండియాలో పెట్టుకుంటాడు. కానీ దీనికి విరుద్ధంగా ముయిజ్జూ చైనా, టర్కీల్లో పర్యటించాడు.

Read Also: Pakistan: పాక్‌లో బలూచ్ మిలిటెంట్లు చైనానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? భారత్ హస్తముందా..?

ఈ ఏడాది లక్షదీవుల పర్యటనకు ప్రధాని వెళ్తే, ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు కొందరు అసభ్యకరమైన విమర్శలు చేశారు. ఫలితంగా మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకులు తగ్గిపోయారు. చాలా ట్రావెల్ ఫ్లాట్‌ఫారమ్స్ మాల్దీవుల బుకింగ్స్‌ని నిలిపేశాయి. ఈ సమయంలో కూడా ఆ దేశం చైనా నుంచి తమ దేశానికి పర్యాటకుల్ని పంపాలని కోరింది. భారత్‌తో మాకు అసవరం లేదనట్లుగా వ్యవహరించింది. అయితే, చైనా నుంచి పర్యాటకులైతే వచ్చారు, కానీ వారు భారతీయులు ఖర్చు చేసేలా ఖర్చు పెట్టకపోవడంతో అసలు విషయం బోధపడింది. తిరిగి చూసే సరికి ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం రెండూ కుప్పకూలాయి. మాల్దీవులు ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడింది. కోవిడ్ సమయంలో కూడా మాల్దీవుల్ని ఆదుకుండి భారతీయ పర్యాటకులే.

ఇప్పుడు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 110 శాతం బాహ్య రుణాలే ఉన్నాయి. మాల్దీవుల విదేశీ మారకద్రవ్య నిల్వలు 440 మిలియన్లకు పడిపోయాయి. ఆరు వారాల దిగుమతులకు మాత్రమే ఇవి సరిపోతాయి. ఓ విధంగా చెప్పాలంటే శ్రీలంక పరిస్థితులు మాల్దీవులకు వచ్చాయి. సరిగ్గా అప్పుడే భారత్ గుర్తుకు వచ్చింది. ముయిజ్జూ భారత పర్యటనకు వచ్చే ముందు మాట్లాడుతూ..‘‘ మా అతిపెద్ద అభివృద్ధి భాగస్వాముల్లో ఒకరు భారత్, మా ఆర్థిక ఇబ్బందుల గురించి వారికి తెలుసు. భారతదేశం మా భారాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని చెప్పాడు.

ఊహించనట్లుగానే భారత్, సోమవారం నాడు 100 మిలియన్ డాలర్ల ట్రెజరీ బిల్లుల చెల్లింపును పొడగించడం ద్వారా నగదు కొరతతో ఉన్న మాల్దీవులకు ఆర్థిక ఉపశమనాన్ని ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్రమోడీతో ముయిజ్జూ జరిపిన చర్చల తర్వాత 400 మిలియన్ డాలర్లను, రూ. 3000 కోట్ల కరెన్సీ మార్పిడి ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన తర్వాత భారత పర్యాటకులు మాల్దీవులకు వెళ్లే సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. పలు ట్రావెల్ ప్లాట్‌ఫారమ్స్ కూడా మాల్దీవుల బుకింగ్స్‌ని తిరిగి ప్రారంభించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • India–Maldives relations
  • Maldives
  • Maldivian President Mohammed Muizzu

తాజావార్తలు

  • Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

  • Unseasonal Rains: రైతాంగంపై అకాల వర్షాల ప్రభావం.. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం!

  • Iran War: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? భయాందోళనలో ప్రపంచ దేశాలు

  • Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!

  • Anushka Shetty: అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ ఇదే..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions