Air India Loss: టాటా గ్రూప్కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Loss: టాటా గ్రూప్ – సింగపూర్ ఎయిర్లైన్స్ల జాయింట్ వెంచర్ అయిన ఎయిర్ ఇండియాకు గత సంవత్సరం ఒక పీడకలగా మారింది. సంవత్సరాల నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టడానికి సిద్ధం అవుతున్న క్రమంలో ఈ విమానయాన సంస్థ ఇప్పుడు దాని చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అహ్మదాబాద్లో జరిగిన విషాద విమాన ప్రమాదం వందలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా కంపెనీ ఆర్థిక వెన్నెముకను కూడా బద్దలు కొట్టింది. పలు నివేదికల ప్రకారం.. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఎయిర్ ఇండియా రూ.15 వేల కోట్ల (సుమారు $1.6 బిలియన్లు) భారీ నష్టాన్ని నివేదించనుంది.
READ ALSO: Anil Ravipudi: 10వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..
Also Read
గల్లంతైన లాభాల ఆశలు..
జూన్కు ముందు ఎయిర్ ఇండియా తన గత ఇబ్బందులను పక్కనపెట్టి తిరిగి గాడిలో పడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ లాభాలు (లాభం లేదు, నష్టం లేదు) సాధించాలని కంపెనీ వ్యవస్థాపకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ జూన్ లో జరిగిన డ్రీమ్లైనర్ ప్రమాదం అన్నింటినీ తారుమారు చేసింది. ఆ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. నిజానికి ఇది ఎయిర్లైన్ వృద్ధికి ఎండ్ కార్డ్ పలికింది. సమస్య అక్కడితో సమసిపోలేదు. భారతదేశంతో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ తన వైమానిక ప్రాంతాన్ని భారత విమానాలకు మూసివేయడానికి దారితీసింది. ఇది ఎయిర్ ఇండియా ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. యూరప్ – అమెరికాకు విమానాలు ఇప్పుడు ఎక్కువ దూరంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీని ఫలితంగా ఇంధనం, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ రెండు సంఘటనలు ఎయిర్ ఇండియా లాభాలపై ఉన్న ఆశలను దెబ్బతీశాయి.
సంతోషంగా లేని బోర్డు..
నష్టాలు పెరగడం వల్ల ఎయిర్లైన్ యజమానులు టాటా గ్రూప్ – సింగపూర్ ఎయిర్లైన్స్ రెండూ కూడా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఎయిర్లైన్ ప్రస్తుత యాజమాన్యం.. పలు వర్గాలు సమాచారం ప్రకారం.. బోర్డుకు కొత్త ఐదేళ్ల ప్రణాళికను సమర్పించిందని, మూడవ సంవత్సరం నుంచి లాభాలను సాధిస్తామని హామీ ఇచ్చిందని సమాచారం. అయితే బోర్డు ఈ ప్రణాళికను పూర్తిగా తిరస్కరించింది. ఎయిర్లైన్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి మరింత దూకుడుగా, వేగవంతమైన సంస్కరణలు అవసరమని బోర్డు విశ్వసిస్తోంది. ఈ గందరగోళం మధ్య, నాయకత్వ మార్పు పుకార్లు కూడా తీవ్రమయ్యాయి. ప్రస్తుత CEO కాంప్బెల్ విల్సన్ స్థానంలో కొత్త వ్యక్తి కోసం టాటా గ్రూప్ వెతుకుతోంది. అయితే విమాన ప్రమాదంపై తుది దర్యాప్తు నివేదిక విడుదలయ్యే వరకు ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగవచ్చని సమాచారం.
కంపెనీ మొత్తం రూ.32,210 కోట్లు..
ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దుర్బలంగా ఉంది. పలు నివేదికల ప్రకారం.. గత మూడు సంవత్సరాలలో కంపెనీ మొత్తం రూ.32,210 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కేవలం గత ఏడాది మాత్రమే ఈ ఎయిర్లైన్ రూ.10 వేల కోట్ల తాజా ఆర్థిక సహాయం కోరింది. 2024లో విస్తారాతో విలీనం తర్వాత ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను కొనుగోలు చేసిన సింగపూర్ ఎయిర్లైన్స్ ఇప్పుడు ఈ నష్టాల భారాన్ని అనుభవిస్తోంది. ఎయిర్ ఇండియా పేలవమైన పనితీరు సింగపూర్ ఎయిర్లైన్స్ ఆదాయాలపై కూడా ప్రభావం చూపుతోంది.
READ ALSO: Harish Rao: “మాకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఇదే”.. సిట్ నోటీసులపై హరీష్రావు ఫైర్
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..