Supreme Court: సుప్రీంకోర్టు క్యాంటీన్లో “నాన్-వెజ్ ఫుడ్”.. నవరాత్రి సమయంలో కొత్త వివాదం..
- సుప్రీంకోర్టు క్యాంటీన్లో మాంసాహరంపై కొత్త వివాదం..
- నవరాత్రి సమయంలో నాన్ వెజ్ని అనుమతించడంపై రగడ..
- మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ న్యాయవాదుల నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు క్యాంటీన్లో మాంసాహారాన్ని అనుమతించడంపై వివాదం మొదలైంది. క్యాంటీన్లో మాంసాహారాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల బృందం కోర్టు బార్ అసోసియేషన్, ఇతర న్యాయ సంఘాలను ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టులో పెద్ద దుమారానికి కారణమైంది.
హిందువులకు పవిత్రమైన నవరాత్రుల్లో, తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాల్లో కొలుస్తారు. ఈ నవరాత్రుల సమయంలో హిందువుల్లో చాలా మంది మాంసాహారాన్ని తినరు. అయితే, నవరాత్రి ఉత్సవాల సమయంలో మాంసాహారాన్ని పున:ప్రారంభించాలనే నిర్ణయంపై సీనియర్ న్యాయవాది రజత్ నాయర్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) మరియు సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA)కి లేఖ రాశారు. ఇతర బార్ సభ్యుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, మళ్లీ నాన్ వెజ్ని క్యాంటిన్లో ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం బార్ కౌన్సిల్ యొక్క ‘‘బహుళవాద సంప్రదాయాల’’తో ఏకీభవించలేదని, ఇది అసహనం, ఒకరినొకరు గౌరవించుకోకపోవడాన్ని చూపించిందని లేఖలో పేర్కొన్నారు. నాయర్ రాసిన లేఖలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న 133 మంది న్యాయవాదులు సమర్థించారు.
Also Read
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
Read Also: Kolkata Doctor Case: ట్రైనీ వైద్యురాలి కేసులో సీబీఐ ఛార్జిషీట్ .. కీలక విషయం వెల్లడి..
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముందుగా క్యాంటీన్లో మాంసాహారాన్ని నిషేధించారు. అయితే దీనికి వ్యతిరేకంగా మరొక వర్గం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ క్యాంటీన్లో నాన్-వెజ్ ఫుడ్ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన తర్వాత మరికొందరు న్యాయవాదులు నుంచి వ్యతిరేకత వచ్చింది. అక్టోబర్ 1వ తేదీన మంగళవారం, న్యాయవాదులు నిరసన తెలిపిన తర్వాత సుప్రీంకోర్టు క్యాంటీన్లో మాంసాహారం వడ్డించడానికి అనుమతి వచ్చింది.
శాఖాహార ఆహారం మాత్రమే ఇవ్వడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్బీబీఏ) అధ్యక్షుడు కపిల్ సిబల్ లేఖ రాశారు. నవరాత్రి సమయంలో మాంసాహారాన్ని నిషేధించే నిర్ణయం తప్పుడు సంకేతాలను ఇస్తుందని అన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా సుప్రీంకోర్టు నవరాత్రి సమయంలో శాఖాహారాన్ని మాత్రమే అందిస్తామని ప్రకటించింది. ఇది అపూర్వమైది మాత్రమే కాదు, చాలా తప్పుడు సంకేతాలను ఇస్తుంది అని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!