Hezbollah: ఆ బాధ్యతలు తీసుకుంటే ఇజ్రాయిల్ చేతిలో చావే.. హిజ్బుల్లా చీఫ్ పదవిని చేపట్టేందుకు భయం..
- హిజ్బుల్లా చీఫ్ బాధ్యతల్ని తీసుకోవాలంటే వణుకుతున్న నేతలు..
- రోజుల వ్యవధిలో నస్రల్లా.. సఫీద్దీన్ హతం..
- బీరూట్ దాడుల్లో ఇద్దర్ని హతమార్చిన ఇజ్రాయిల్..
- కొత్త చీఫ్గా బాధ్యతలు తీసుకునేందుకు ఇబ్రహీం అమీన్ నిరాకరణ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మద్దతు కలిగిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కకావిలకం అవుతోంది. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో బీరూట్ దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లను వెతికి వెంటాడి చంపేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్గా ఉన్న హసన్ నస్రల్లాని బీరూట్ దాడిలో ఇజ్రాయిల్ చంపేసింది. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన హషీమ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయిల్ దాడిలో మరణించాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే కీలకమైన నేతల్ని మట్టుపెట్టింది. దీనికి ముందు కీలకమైన హిజ్బుల్లా కమాండర్లను ఇజ్రాయిల్ హతం చేసింది.
Read Also: Mahila Bank: ఈ బ్యాంకులో అందరు మహిళా ఉద్యోగులే.. మహిళలకు మాత్రమే రుణాలు
Also Read
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
అయితే, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్గా ఎవరు బాధ్యతలు చేపట్టినా చంపేస్తాం అని ఇజ్రాయిల్ పరోక్షంగా దాడులతో సమాధానం ఇస్తోంది. బాధ్యతలు తీసుకునేందుకు ఇప్పుడు హిజ్బుల్లా నేతలు వణుకుతున్నట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా పొలిటికల్ కౌన్సిల్ చీఫ్ ఇబ్రహీం అమీన్ అల్-సయ్యద్ తదుపరి బాధ్యతలు తీసుకుంటానే సమాచారం వినిపిస్తోంది. హషీమ్ సఫిద్దీన్ మరణం తర్వాత ఇతడి పేరు వచ్చింది. అయితే, ఈ బాధ్యతల్ని తీసుకునేందుకు అతను ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
అయితే, హిజ్బుల్లా మాత్రం ఇప్పుడు నస్రల్లా వారసుడిగా ఎవరిని నామినేట్ చేయలేదని చెబుతోంది. ‘‘సమిష్టి నాయకత్వం’’లో హిజ్బుల్లా, ఇజ్రాయిల్పై పోరాడుతోందని చెబుతున్నారు. హిజ్బుల్లాను విమర్శించే అలీ అల్ అమిన్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరూ బాధ్యతలు తీసుకున్నా.. నస్రల్లా, సఫీద్దీన్కి పట్టిన గతే వారికి పడుతుందని అన్నారు. ‘‘ఏ అభ్యర్థి అయినా కూడా వారు మరణానికి అభ్యర్థి’’ అని చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ దాడులతో హిజ్బుల్లా అయోమయంలో ఉంది. పార్టీ డిప్యూటీ లీడర్ తన పాత్రను బట్టి నయీమ్ ఖాస్సెం తాత్కాలిక సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!