Venu Goapl Reddy
Author- NTV Telugu-
Parliament breach: పార్లమెంట్లో దాడి చేసిన నిందితులకు బెయిల్..
Parliament breach: డిసెంబర్ 13, 2023న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టయిన నీలం ఆజాద్,మహేష్ కుమావత్లకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు ఒక్కొక్కరూ రూ. 50,000 బెయిల్ బాండ్, అంతే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ షరతుల్లో భాగంగా నిందితులు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా కేసుకు సంబంధించిన ఏదైనా బహిరంగ ప్రకటన చేయకుండా కోర్టు నిషేధించింది. -
Annamalai: అన్నామలైపై క్రిమినల్ కేసు.. వివాదంగా పవన్ కళ్యాణ్ హాజరైన సభ..
Annamalai: ఇటీవల మధురై కేంద్రంగా మురుగన్ భక్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేశారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే. అన్నామలైపై, హిందూ మున్నాని గ్రూపులోని ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వంజినాథన్ అనే న్యాయవాది ఆరోపించారు. -
Father: ఛీ వీడేం తండ్రి.. టైమ్కు నిద్ర పోవడంలేదని 5 ఏళ్ల కూతురుకు టార్చర్..
Father: కన్నకూతుకు ఇబ్బంది రాకుండా చూసుకునే తండ్రులు ఉంటారు, కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన 5 ఏళ్ల కూతురును చిత్రహింసలు పెట్టాడు. పాప సకాలంలో నిద్ర పోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్తో కాల్చడంతో పాటు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
Covid Vaccine: కోవిడ్ తర్వాత మరణాలకు వాక్సిన్లు కారణం కాదు.. తాజా అధ్యయనంలో వెల్లడి..
Covid Vaccine: కరోనా తర్వాత కొందరు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు దేశంలో రికార్డ్ అయ్యాయి. అయితే, వ్యాక్సిన్ల వల్లే మరణాలు సంభవించాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), AIIMS నిర్వహించిన విస్తృతమైన అధ్యయనాలు చెక్ పెట్టాయి. కరోనా వ్యాక్సిన్లకు ఆకస్మిక అకాల మరణాలకు ఎలాంటి సంబంధాలు లేవని అధ్యయనం వెల్లడించింది. దేశంలో 40 ఏళ్ల లోపు పెద్దలకు గుండెపోటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టడీ వెలువడింది. -
Donald Trump: అతి తక్కువ సుంకాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం..
Donald Trump: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు దగ్గరపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్-యూఎస్ త్వరలో ‘‘చాలా తక్కువ సుంకాలతో’’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. దీని వల్ల రెండు దేశాలు పోటీ పడుతాయని చెప్పారు. -
Quad: భారత్కు దౌత్య విజయం.. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ నేతలు..
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు. -
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తొలి బృందం.. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు..
Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. -
Donald Trump: 60 రోజుల గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది..
Donald Trump: హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. -
High Court: అమ్మాయికి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పినంత మాత్రాన ‘‘లైంగిక’’ ఉద్దేశం ఉన్నట్లు కాదు..
High Court: 2015లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో 25 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాలిక చేయి పట్టుకుని ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పినందుకు నాగ్పూర్ సెషన్స్ కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. నిందితుడి తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది సోనాలి ఖోబ్రగడే సెషన్స్ కోర్టు తీర్పుపై అప్పీలు చేశారు. లైంగిక వేధింపులను నిరూపించేందుకు ఈ కేసులో […] -
India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..
India-US trade deal: ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అమెరికాకు చెందిన నేతలు మాట్లాడుతూ.. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని చెబుతున్నారు. కానీ, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా, కొన్ని రంగాల్లోకి అమెరికాను అనుమతించేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. ఇండియాపై ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గడం లేదు. దీంతో, పరస్పర సుంకాల అమలులోకి రావడానికి జూలై 09 తుది గడువుగా ఉన్నప్పటికీ, ఆలోపు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం కష్టంగానే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!