Tamil Nadu Governor: ‘‘జై శ్రీరాం’’ నినాదం వివాదంలో గవర్నర్ ఆర్ఎన్ రవి..
- మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి..
- విద్యార్థుల్ని ‘‘జై శ్రీరాం’’ నినాదం చెప్పాలని కోరడంపై వివాదం..
- గవర్నర్ని విమర్శిస్తున్న ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు..
- బిల్లుల విషయంలో ఇటీవల గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
ఒక కార్యక్రమానికి హాజరైన ఆర్ఎన్ రవి విద్యార్థుల్ని ‘‘జైశ్రీరాం’’ అని నినాదం చేయాలని కోరారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఆయన చర్యని ప్రభుత్వంతో పాటు విద్యా సంస్థల నాయకులు ఖండిస్తున్నారు. ఒక విద్యాసంస్థ కూడా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరింది.
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
Read Also: Bengal Waqf Clashes: బెంగాల్లో బలపడుతున్న బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ.. ఇంటెల్ హెచ్చరిక..
SPCSS-TN (స్టేట్ ప్లాట్ఫామ్ ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ – తమిళనాడు) ఒక ప్రకటనలో.. ‘‘మిస్టర్ ఆర్ఎన్ రవి తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని పాటించడంలో ఆయన దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించడంలో విఫలమయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందుకు తమిళనాడు గవర్నర్ని వెంటనే తొలగించాలి’’ అని డిమాండ్ చేసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత శశికాంత్ సెంథిల్ కూడా రవిపై ఎక్స్లో విమర్శలు గుప్పించారు. ‘‘సుప్రీంకోర్టు విమర్శల తర్వాత అతను ఇప్పుడు వ్యవస్థల్ని చికాకు పెట్టడానికి విద్యార్థుల్ని జై శ్రీరాం నినదించేలా చేయడం వంటి విన్యాసాలు చేస్తున్నారు, ఆయన నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మార్గాలు కనుగొంటారు.’’ అని సెటైర్లు వేశారు. ఇది ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగ సూత్రాలను బలహీనపరిచే అహంకారం, ధిక్కరణల ప్రమాదకరమైన మిశ్రమమని అన్నారు.
తాజావార్తలు
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!