Tamil Nadu Governor: ‘‘జై శ్రీరాం’’ నినాదం వివాదంలో గవర్నర్ ఆర్ఎన్ రవి..
- మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి..
- విద్యార్థుల్ని ‘‘జై శ్రీరాం’’ నినాదం చెప్పాలని కోరడంపై వివాదం..
- గవర్నర్ని విమర్శిస్తున్న ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు..
- బిల్లుల విషయంలో ఇటీవల గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
ఒక కార్యక్రమానికి హాజరైన ఆర్ఎన్ రవి విద్యార్థుల్ని ‘‘జైశ్రీరాం’’ అని నినాదం చేయాలని కోరారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఆయన చర్యని ప్రభుత్వంతో పాటు విద్యా సంస్థల నాయకులు ఖండిస్తున్నారు. ఒక విద్యాసంస్థ కూడా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరింది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Bengal Waqf Clashes: బెంగాల్లో బలపడుతున్న బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ.. ఇంటెల్ హెచ్చరిక..
SPCSS-TN (స్టేట్ ప్లాట్ఫామ్ ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్ – తమిళనాడు) ఒక ప్రకటనలో.. ‘‘మిస్టర్ ఆర్ఎన్ రవి తన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగాన్ని పాటించడంలో ఆయన దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించడంలో విఫలమయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందుకు తమిళనాడు గవర్నర్ని వెంటనే తొలగించాలి’’ అని డిమాండ్ చేసింది.
సీనియర్ కాంగ్రెస్ నేత శశికాంత్ సెంథిల్ కూడా రవిపై ఎక్స్లో విమర్శలు గుప్పించారు. ‘‘సుప్రీంకోర్టు విమర్శల తర్వాత అతను ఇప్పుడు వ్యవస్థల్ని చికాకు పెట్టడానికి విద్యార్థుల్ని జై శ్రీరాం నినదించేలా చేయడం వంటి విన్యాసాలు చేస్తున్నారు, ఆయన నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మార్గాలు కనుగొంటారు.’’ అని సెటైర్లు వేశారు. ఇది ప్రజాస్వామ్య సంస్థలను, రాజ్యాంగ సూత్రాలను బలహీనపరిచే అహంకారం, ధిక్కరణల ప్రమాదకరమైన మిశ్రమమని అన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!