Bengal Violence: ముర్షిదాబాద్ సహా బెంగాల్ 4 జిల్లాల్లో AFSPA చట్టాన్ని విధించాలి..
- బెంగాల్ హింసపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
- ముర్షిదాబాద్ సహా 4 జిల్లాల్లో AFSPA చట్టాన్ని విధించాలని డిమాండ్..
- వక్ఫ్ అల్లర్లతో అట్టుడుకుతునున్న బెంగాల్..
- మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Violence: గత కొన్ని రోజులుగా బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 150 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ముర్షిదాబాద్తో సహా సరిహద్దుల్లో ఉన్న మరో మూడు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) విధించాలని బిజెపి ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహాతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ‘‘బెంగాల్ అంటుకుంటోంది. హిందువులు రక్తసిక్తం అవుతున్నారు. ముర్షిదాబాద్, మాల్డా, నాడియా, దక్షిన 24 పరగణాలు జిల్లాల్లో హిందువులపై దాడి చేస్తున్నారు. ఇళ్లను దోపిడి, ప్రాణాలు కోల్పోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ శాంతిభద్రతల్లో విఫలమైంది. ఒకప్పుడు కాశ్మీరీ పండిట్ల మాదిరిగానే, బెంగాల్ హిందువుల్ని వేటడుతున్నారు. 1958 చట్టంలోని సెక్షన్ 3 కింద AFSPA విధించాలని నేను అమిత్ షాని కోరుతున్నాను’’ అని మహతో అమిత్కి లేఖ రాశారు.
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Amaravati: భూసమీకరణకు కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. మరో 44 వేల ఎకరాల భూసమీకరణ!?
శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు AFSPA ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. సెర్చ్ ఆపరేషన్లు, వారెంట్ లేకుండా అరెస్టు చేయడం, బలగాలను ఉపయోగించడం, కొన్ని పరిస్థితులలో చంపడానికి కాల్చులు కూడా జరిపే అధికారాలను ఇస్తుంది. పురూలియా ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో 4 జిల్లాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
ముర్షిదాబాద్ జిల్లాలోనే 86 కి పైగా హిందూ దుకాణాలు, ఇళ్ళు దోచుకోబడి ధ్వంసం చేయబడ్డాయని, జావనా గ్రామంలో తమలపాకు తోటల్ని తగులబెట్టారని ఆయన చెప్పారు. మాల్డా, నాడియా, సౌత్ 2 పరగణాలలో ఇలాంటి అశాంతి చెలరేగిందని, ఇక్కడ కూడా టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, మతపరమైన అల్లర్లు హిందువుల్ని బలహీనంగా, నోరు మెదపకుండా మార్చాయని ఆయన అన్నారు. ఇద్దరు తండ్రీకొడుకుల్ని చంపిన ఘటనను ఆయన ప్రస్తావించారు. హిందూ సమాజమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!