Ukraine War: ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి, 80 మందికి గాయాలు..
- ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి..
- క్షిపణితో విరుచుకుపడిన రష్యా..
- సుమీ నగరంపై దాడిలో 21 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆదివారం సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 21 మంది మరణించగా, 83 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. ఈ ఏడాది ఉక్రెయిన్లో జరిగిన భయంకరమైన దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ఖండించారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
‘‘కేవలం దుష్టులు మాత్రమే ఇలా ప్రవర్తించగలరు. సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్నారు’’ అని ఆయన సోషల్ మీడియాలో రాశారు. దాడిలో నేలపై పడి ఉన్న శవాలు, దెబ్బతిన్న బస్సులు, కార్లను చూపించే ఫోటోలను పోస్ట్ చేశారు. దాడి జరిగినప్పుడు బాధితులు వీధిలో, వాహనాల్లో, భవనాల్లో ఉన్నట్లు అంతర్గత మంత్రి చెప్పారు. ముఖ్యమైన చర్చి పండగ రోజున ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.
Also Read
- Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ఉక్రెయిన్ సెంటర్ ఫర్ కౌంటర్ డిసైన్ఫర్మేషన్ను నిర్వహిస్తున్న భద్రతా అధికారి ఆండ్రీ కోవెలెంకో, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కోను సందర్శించిన తర్వాత ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి వెట్కాఫ్ శుక్రవారం సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశయ్యారు.
ఆదివారం రష్యా దాడి తర్వాత జెలెన్స్కీ దీనిని ఉగ్రవాదంగా అభివర్ణించారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రష్యా సరిగ్గా ఇలాంటి ఉగ్రవాదాన్ని కోరుకుంటోందని, యుద్ధాన్ని పెంచుతోందని, దురాక్రమణదారుడిపై ఒత్తిడి లేకుండా, శాంతి అసాధ్యమని జెలెన్స్కీ అన్నారు. చర్యలు ఎప్పుడు బాలిస్టిక్ క్షిపణి దాడుల్ని, వైమానికి బాంబులను ఆపలేవని చెప్పాడు.
రష్యా ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించింది. ప్రస్తుతం తూర్పు, దక్షిణ ప్రాంతాలలో దేశంలోని 20 శాతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ దాడికి ముందు, రష్యా తమ ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ దాడి చేసిందని ఆరోపించింది. ఇది అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఉక్రెయిన్, రష్యా గత నెలలో ఒకరి ఇంధన సౌకర్యాలపై మరొకరు దాడులను నిలిపివేయడానికి అంగీకరించాయి. ఇప్పుడు ఇరు పక్షాలు తాత్కాలిక నిషేధాన్ని ఉల్లంఘించాయి.
https://twitter.com/ZelenskyyUa/status/1911340183800205684
తాజావార్తలు
-
Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!