Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. -
Karnataka hijab row: దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court on Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో హిజాబ్ నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు కూడా విద్యాసంస్థల్లో తప్పకుండా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. -
Heavy Rains: బీ అలర్ట్.. దక్షిణాదికి భారీ వర్ష సూచన
Heavy rain forecast for southern states: భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. రానున్న రోజుల్లో అన్ని సౌత్ స్టేట్స్ లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నాలుగు రోజుల పాటు తీవ్రమైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో ఒడిశా, మహారాష్ట్రల్లో భారీ వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే సమయంలో వాయువ్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. -
Antibiotics: యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్లో అజిత్రోమైసిన్
Indians Use Antibiotics Excessively, Azithromycin On Top: దేశంలో ప్రజలు యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను విస్తృతంగా వాడినట్లు స్టడీలో వెల్లడించింది. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరం, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ కు లొంగకుండా తయారవుతుందని లాన్సెట్ వెల్లడించింది. -
No Jeans, T-Shirts In Office: అక్కడ ప్రభుత్వ ఆఫీసుల్లోకి నో జీన్స్, టీ షర్ట్స్.. ఓన్లీ ఫార్మల్
No Jeans, T-Shirts In Office in Uttar Pradesh:ఇక ఆ జిల్లాలో ప్రభుత్వ అధికారులంతా తప్పని సరిగా ఫార్మల్ డెస్సుల్లోనే విధుల్లోకి హాజరు కావాలి. కాదు, కూడదు అని జీన్స్, టీ షర్టులు వేసుకుని వచ్చారో అంతే సంగతులు. ఇలా చేస్తే ఉద్యోగులు ఉన్నతాధికారుల చర్యలకు గురికావాల్సిందే. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో. బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో(కలెక్టర్ ఆఫీస్) ఉద్యోగులు, అధికారులు తప్పని సరిగా అధికారిక డ్రెస్ కోడ్ లో రావాలని జిల్లా యంత్రాంగం -
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గుర్రాన్ని బహుమతిగా ఇచ్చిన దేశాధ్యక్షుడు
Rajnath Singh Gifted Horse By Mongolian President: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగోలియా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఏడేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ మంగోలియాలో పర్యటించారు. ఆ సమయంలో మంగోలియా ప్రభుత్వం మోదీకి ఓ గుర్రాన్ని బహూకరించింది. తాజాగా రాజ్ నాథ్ సింగ్ కు కూడా ఆ దేశాధ్యక్షడు ఖరేల్ సుఖ్ ఓ గుర్రాన్ని బహుమతిగా ప్రధానం చేశారు. -
Delhi: ఫైర్ క్రాకర్స్పై ఢిల్లీ ప్రభుత్వం బ్యాన్.. ఈ దీపావళికి క్రాకర్స్ లేనట్లే.
Delhi Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళికి కూడా ఢిల్లీ నగర పరిధిలో ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ సారి కూడా ఢిల్లీ పరిధిలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ప్రకటించారు. ఆన్ లైన్ లో కూడా పటాకుల అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని.. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను కఠినంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. -
COVID 19: ఇండియాలో కొత్తగా 5 వేల కేసులు.. 27 మంది మృతి
Corona cases in india: దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. మూడు నెలల కనిష్ట స్థాయికి కరోనా కేసులు చేరుకున్నాయి. కొన్ని రోజుల వరకు దేశంలో సగటున 15 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండేవి. అయితే గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 10 వేలకు లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 7,094 మంది మహమ్మారి… -
West Bengal: పశ్చిమ బెంగాల్ లో మరో మంత్రి టార్గెట్గా సీబీఐ దాడులు
CBI Raids Bengal Law Minister In Coal Scam Case: మరో పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసాలు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) అధికారులు దాడులు చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్న మోలోయ్ ఘటక్ మూడు ఇళ్లపై, కార్యాలయాతో పాటు మొత్తం ఏడు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. అసన్సోల్, కోల్కతా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి… -
Suella Braverman: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి.
Indian-origin Suella Braverman appointed UK Home Secretary: యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న లిజ్ ట్రస్, కొత్తగా యూకే హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రవర్మన్ను నియమించారు. లిజ్ ట్రస్ గెలిచిన తర్వాత ఆ పదవిలో ఉన్న ప్రతీ పటేల్ స్థానంలో సుయెల్లా బ్రవర్మన్ను ఈ బాధ్యతలను తీసుకున్నారు. ఈమె పార్లమెంట్ లో ధమ్మపదపై ప్రమాణం చేసి బాధ్యతలను చేపట్టారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!