OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై యుద్ధం ప్రకటించారు. తన నియోజకవర్గంలో పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారంటూ స్వయంగా ఎమ్మెల్యేనే ఆరోపించారు. అయితే… మాటలతో సరిపెట్టకుండా… రేషన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే… రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఆ క్రమంలోనే…. రెండు వారాల క్రితం అనుచరుల ఇన్ఫర్మేషన్తో అధికారుల్ని అలర్ట్ చేశారు ఎమ్మెల్యే. తక్షణం స్పందించిన అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఇక తాజాగా… రెండు రోజుల క్రితం మాధవి నివాసానికి సమీపంలోనే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారం వచ్చింది. దీంతో నేరుగా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. రేషన్ షాపు దగ్గరికి వచ్చి…. బియ్యం లోడు చేసిన వాహనాన్ని ఆపి డ్రైవర్ను ప్రశ్నించారామె. డైరెక్ట్గా శాసనసభ్యురాలే రంగంలోకి దిగి పట్టించడంతో… అధికారులు కూడా వెంటనే అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని సీజ్ చేశారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోందని నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపించడం, ఆమే వాహనాన్ని పట్టించడం జిల్లాలో సంచలనమైంది. అంత వరకు బాగానే ఉందని అనుకున్నా…. ఆమె వైఖరి టీడీపీకే చెందిన ఇతర శాసనసభ్యులకు ఇబ్బందికరంగా మారుతోందన్నది లేటెస్ట్ హాట్.
Also Read
అదేంటి… ఎమ్మెల్యే మాధవి తన నియోజకవర్గంలో రేషన్ అక్రమాలను ఆపితే మిగతా వాళ్ళకు ఇబ్బంది ఏంటని అనుకుంటున్నారా…? కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉందట. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకు రేషన్ డీలర్లుగా అవకాశం కల్పిస్తుంటారు. ఇది ప్రతి నియోజకవర్గంలోనూ జరిగే తంతే. ఇక రేషన్ డీలర్లు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటారన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో రేషన్ డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసేవాళ్ళలో ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా ఉంటారు. వీరు వివిధ గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని సిండికేట్ బాస్ కు అమ్ముతుంటారు. ప్రతిచోట ఇది బహిరంగ రహస్యం. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా ప్రజాప్రతినిధుల అనుచరులకు లక్షలు మిగులుతాయన్న ప్రచారం సైతం ఉంది. కొంతమంది దీన్నో ఆదాయ వనరుగా మార్చుకున్నారనడంలో ఎలాంటి సందేహం ఉండబోదన్న మాటలు సైతం వినిపిస్తుంటాయి. ఒక్కో నియోజకవర్గంలో నెలకు పది నుంచి ఇరవై లక్షల వరకూ బియ్యం అమ్మకాల ద్వారా దండుకుంటున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదంతా ఆ స్థాయిలో జరుగుతంటే… జిల్లాలో ఏ ప్రజాప్రతినిధి కూడా అటువైపు కన్నెత్తి చూసింది లేదు. ఈ వ్యవహారంలో ఉన్నవారంతా అధికార పార్టీకి చెందిన వాళ్ళే కాబట్టి…. పవర్ ఉన్నప్పుడే మనోళ్ళని నాలుగు రాళ్ళు వెనకేసుకోనివ్వండన్న వైఖరితో ఉంటారట. కానీ… ఇప్పుడు గళ్లా మాధవి రేషన్ అక్రమాల పేరుతో ఆరోపణలు చేయడం, స్వయంగా వాహనాలను పట్టుకోవడం జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందట.
గుంటూరు వెస్ట్లో ఆ స్థాయిలో అక్రమ రవాణాను అడ్డుకుంటుంటే మిగతా వాళ్ళంతా కామ్ ఉండటం ఏంటంటూ చర్చ మొదలవడం వాళ్లకు మింగుడు పడ్డంలేదట. కొంతమందిని అయితే… ఎమ్మెల్యే మాధవిలా మీరు కూడా రేషన్ అక్రమాలు జరక్కుండా ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీంతో… ఆమె పోరాటం ఏమోగానీ… మా ప్రాణానికి వచ్చిందంటూ ఉమ్మడి గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేలు సణుక్కుంటున్నారట. ఇంకొందరైతే… ఎందుకమ్మా మమ్మల్ని ఇరికిస్తున్నావ్… అంటూ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!