Karnataka hijab row: దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court on Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో హిజాబ్ నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు కూడా విద్యాసంస్థల్లో తప్పకుండా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉన్నట్లేనా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 19(1)ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ హక్కుల్లో దుస్తులు ధరించే హక్కు ఒక భాగమని.. అంతకు ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు పిటిషన్ల తరుపు న్యాయవాది దేవదత్ కామత్. వాదనల్లో భాగంగా దీనిపై స్పందించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాక్యలు చేసింది. అయితే నేను అలా అనడం లేదని.. పాఠశాలల్లో ఎవరూ బట్టలు విప్పడం లేదని దేవదత్ కామత్ బదులిచ్చారు. గతంలో 19(1) ప్రకారం భావవ్యక్తీకరణ హక్కును నల్సా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు పిటిషన్ల తరుపు న్యాయవాది. ముస్లిం బాలికలు తలపై వస్త్రం కప్పుకోవడానికి అనుమతినిస్తూ కేంద్రీయ విద్యాలయాలు జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ప్రస్తావించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Heavy Rains: బీ అలర్ట్.. దక్షిణాదికి భారీ వర్ష సూచన
అయితే ఇక్కడ హిజాబ్ ధరించడాన్ని ఎవరూ నిషేధించలేదని.. మీరు దాన్ని కావాల్సిన చోట ధరించవచ్చని.. పాఠశాలల్లో మాత్రమే ఆంక్షలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం హిజాబ్ పై నిషేధాన్ని విధించిందని న్యాయవాది దేవదత్ కామత్ సుప్రీంకోర్టులో వాదించారు. అయితే దీనికి ధర్మాసనం.. ఇది సరైనది కాకపోవచ్చే అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఓ వర్గం మాత్రమే తలపై వస్త్రం కప్పుకుని రావాలనుకుంటోంది.. మరో వర్గం పాఠశాల దుస్తులను ధరిస్తూ నిబంధనలను పాటిస్తోందని వ్యాఖ్యానించింది. దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!