Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. ఈ రోజు మొత్తంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. ఆ తరువాత 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పాదయాత్ర సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడుతలుగా పాదయాత్ర చేయనున్నారు.
Also Read
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు వేలాదిగా కార్యకర్తలు హాజరయ్యారు. రెండో రోజు పాదయాత్ర సమయంలో చిన్నారులతో మమేకం అయ్యారు. కన్యాకుమారి వీధుల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. మరో రెండు రోజులు పాటు తమిళనాడులోనే రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. కేరళలోని 12 లోక్ సభ, 42 అసెంబ్లీ స్థానానల్లో రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 29 వరకు కేరళలో యాత్ర సాగనుంది. రాష్ట్రంలోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దాదాపుగా 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర జరగనుంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పాదయాత్ర చేయడం లేదని.. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రను చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?