Venu Goapl Reddy
Author- NTV Telugu-
Gujarat: 15 ఏళ్ల బాలుడిని చంపేసిన సింహాలు..
Lioness kills 15-year-old boy in Gujarat: గుజరాత్ అమ్రేలి జిల్లాలో సింహాలు బాలుడిని చంపేశాయి. వావ్డీ గ్రామానికి చెందిన రాహుల్ మోస్వానియా అనే 15 ఏళ్ల బాలుడిపై సింహాలు దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రామ శివారులోని రహదారి గుండా నడుచుకుంటూ వస్తున్న సయమంలో బాలుడిపై సింహాలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రగాయాల పాలైన రాహుల్ చనిపోయాడు. మరణించిన బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తారు. సింహాలను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసియాటిక్ సింహాలకు… -
Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్లో లుకలుకలు.. సీఎం పదవిని కాపాడుకునే ప్రయత్నంలో గెహ్లాట్
Rajasthan Congress crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎం అశోక్ గెహ్లాట్ చేపడుతారనే వార్తల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు యువనేత సచిన్ పైలెట్ రాజస్థాన్ కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో.. అశోక్ గెహ్లాట్ తన పదవిని కాపాడుకునే… -
PM Narendra Modi: ప్రధాని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన యూఎస్ఏ, ఫ్రాన్స్.
France and USA praised Prime Minister Modi's comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ చెప్పిన మాట సరైనదని ఆయన అన్నారు.… -
Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
Karnataka government on the Heijab: కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. మంగళవారం జరిగిన విచారణలో కర్ణాటక ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. హిజాబ్ అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉందని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిజాబ్ అల్లర్ల వెనక పీఎఫ్ఐ కుట్ర ఉందని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. హిజాబ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఈ సంస్థ ప్రారంభించిందని కర్ణాటక ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్… -
First multiplex in Jammu Kashmir: శ్రీనగర్లో తొలి మల్టీప్లెక్స్ ప్రారంభం.. మూడు దశాబ్ధాల తరువాత ఇప్పుడే..
First multiplex in Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొత్త చరిత్ర మొదలైంది. మూడు దశాబాద్ధాల కాశ్మీరీ ప్రజల కల నెరవేరింది. గతంలో నిత్యం ఉగ్రవాద దాడులు, కాల్పులతో అట్టుడుకుతూ ఉండే కాశ్మీర్ లో ప్రజలు ఇప్పుడిప్పుడే వినోదానికి దగ్గర అవుతున్నారు. కాశ్మీర్ జిల్లాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదివారం పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో మల్లిపర్సస్ థియేటర్లను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా. దీన్ని చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో… -
Bengaluru: నగ్న చిత్రాలను షేర్ చేసిన డాక్టర్ని హత్య చేసిన ప్రియురాలు
Doctor killed by fiance in Bengaluru: ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడిని హతమార్చింది ఓ యువతి. తన నగ్న చిత్రాలను సోషల్ మీడియా షేర్ చేసిందుకు ప్రియుడిని స్నేహితులతో కలిసి చంపేసింది. డాక్టరైన ప్రియుడు తన ప్రియురాలికి తెలియకుండా సోషల్ మీడియాలో ఆమె న్యూడ్ ఫోటోలను షేర్ చేశాడు. దీన్ని గమనించిన ప్రియురాలు అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సెప్టెంబర్ 14న మరణించాడు. -
Subbulakshmi Jagadeesan: సీఎం స్టాలిన్కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత
Subbulakshmi Jagadeesan quits DMK Party: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు పెద్ద షాక్ తగిలింది. పార్టీలో కీలక నేత, మాజీ కేంద్రమంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సబ్బులక్ష్మీ జదీశన్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్న సుబ్బులక్ష్మీ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్టాలిన్ కు తన రాజీనామాను సమర్పించారు. క్రియాశీలక రాజకీయం నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. -
Uttar Pradesh: కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లో భోజనం.. యోగి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
Food served to kabaddi players in the toilet: ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16న సహరాన్ పూర్ బాలికల అండర్ -17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన… -
Covid Cases: గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. ఒకటికి తగ్గిన పాజిటివిటీ రేటు
Corona Cases In India: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక నెల క్రితం వరకు సగటున 15 వేలకు పైగా నమోదుతూ వచ్చిన రోజూవారీ కరోనా కేసులు ప్రస్తుతం 5 వేల దిగువన నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 4,043 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 4,676 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు -
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ కేంద్రంగా కదులుతున్న డొంక
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో ముడపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీనివాసరావు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.…
తాజావార్తలు
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!